English | Telugu

గ‌బ్బ‌ర్ సింగ్‌ని కాపీ కొట్టారా??

కొన్నేళ్లుగా హిట్ కోసం త‌హ‌త‌హ‌లాడుతున్నాడు నంద‌మూరి హీరో క‌ల్యాణ్‌రామ్‌. భారీగా ఖ‌ర్చు పెట్టి తీసిన ఓం త్రీడీ సినిమా అట్ట‌ర్ ఫ్లాప్ అవ్వ‌డంతో ఈసారి ప్ర‌యోగాల జోలికి పోకుండా ఓ ఫుల్ లెంగ్త్ క‌మ‌ర్షియ‌ల్ మూవీ చేశాడు. అదే.. ప‌టాస్‌. ఈ సినిమాలో క‌ల్యాణ్‌రామ్ ఓ న‌కీలి, లంచ‌గొండీ పోలీస్ గా క‌నిపించ‌నున్నాడు. అయితే ఈ సినిమాకీ ప‌వ‌న్ క‌ల్యాణ్ గ‌బ్బ‌ర్ సింగ్ సినిమాకీ ద‌గ్గ‌ర పోలిక‌లున్నాయని టాక్‌. ఇటీవ‌ల సెన్సార్ పూర్తి చేసుకొన్న ఈ సినిమాని చూసిన కొంత‌మంది ''అచ్చం గ‌బ్బ‌ర్ సింగ్‌లా ఉంది క‌దా..'' అనే సందేహం వ్య‌క్తం చేశారు. క‌థ వేరే అయినా క‌ల్యాణ్‌రామ్ క్యారెక్ట‌రైజేష‌న్‌పై మాత్రం గ‌బ్బ‌ర్ సింగ్ ప్ర‌భావం భారీగా ప‌డింద‌ని తెలుస్తోంది. అయితే ఈ విష‌యంపై ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి స్పందించాడు. ''గ‌బ్బ‌ర్ సింగ్‌కీ ఈ సినిమాకీ ఎలాంటి సంబంధం లేదు. ఆ క‌థ, ఈ క‌థ రెండూ వేర్వేరు'' అంటున్నాడు. ఇంకెంత‌..?? రెండ్రోజుల్లో ప‌టాస్ బొమ్మ తెర‌పై ప‌డిపోతుంది. అప్పుడు ఏది అస‌లో, ఏది కాపీనో తెలిసిపోతుంది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.