English | Telugu

రక్తపు మరకలతో విజ‌య్... చుట్టూ పోలీసులు!

మిగిలిన వాళ్ల సంగ‌తి ఏమోగానీ విజ‌య్ సేతుప‌తి మాత్రం 2023ని అస్స‌లు మ‌ర్చిపోరు. అంత‌గా క‌లిసొచ్చింది ఈ ఏడాది ఆయ‌న‌కు. షాహిద్ క‌పూర్ న‌టించిన వెబ్ సీరీస్ ఫ‌ర్జిలో కీల‌క పాత్ర‌లో న‌టించారు హీరో విజ‌య్ సేతుప‌తి. ఈ వెబ్ సీరీస్‌కి అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది. ఆ వెబ్ సీరీస్ సంగ‌తి అటు ఉంచితే, ఈ ఏడాది ఆయన న‌టించిన ఆరు సినిమాలు విడుద‌ల‌య్యాయి. ఇంకో సినిమా కూడా విడుద‌ల‌కు రెడీ అవుతోంది. అదే ఆయ‌న బాలీవుడ్‌లో న‌టించిన మెర్రీ క్రిస్‌మ‌స్‌. కెరీర్ ప్రారంభించిన కొన్నాళ్ల‌లోనే 50 సినిమాల‌కు చేరువైన న‌టుల్లో ఒక‌రిగా పేరు తెచ్చుకున్నారు విజ‌య్ సేతుప‌తి. ఆయ‌న న‌టించిన వీజేయ‌స్‌50వ సినిమా ఫ‌స్ట్ లుక్ విడుద‌లైంది. ఆయ‌న న‌టించిన వీజేయ‌స్‌50 సినిమాకు మ‌హారాజా అనే పేరు ఫిక్స్ చేశారు. ఈ సినిమాను నితిల‌న్ స్వామినాథ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. విజ‌య్ సేతుప‌తి న‌టించిన మ‌హారాజా సినిమా యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ జోనర్‌లో సాగుతుంది.

ఈ సినిమా గురించి విజ‌య్ సేతుప‌తి త‌న అఫిషియ‌ల్ ఎక్స్ హ్యాండిల్‌లో పోస్ట్ చేశారు. బార్బ‌ర్ సీట్‌లో గాయాల‌తో కూర్చుని ఉన్న విజ‌య్ సేతుప‌తి ఫ‌స్ట్ లుక్ ఆక‌ట్టుకుంటోంది. వ‌యొలెన్స్ కా బాప్ అన్న‌ట్టుంది పోస్ట‌ర్‌. ఆయ‌న మెడ వెనుక ఉన్న బ్యాండేజ్, కుర్చీ లెగ్‌లో ఉన్న బ్ల‌డ్‌, ఆ వెనుక పోలీసులు, విరిగిన గోడ‌లో నుంచి వాళ్లు ఈ దృశ్యాన్ని చూడ‌టం వంటివ‌న్నీ ఫ్యాన్స్ కి ఫ‌స్ట్ లుక్‌లో న‌చ్చేశాయి.

ఈ సినిమాకు రైట‌ర్ కూడా నితిల‌న్‌. సుధాన్ సుంద‌రం, జ‌గ‌దీష్ ప‌ళ‌నిసామి నిర్మిస్తున్నారు. అనురాగ్ క‌శ్య‌ప్ కూడా ఈ సినిమాలో కీ రోల్ చేశారు. విజ‌య్ సేతుప‌తి గ‌త చిత్రాల్లాగ‌నే మ‌హారాజా కూడా పెద్ద హిట్ అవుతుంద‌నే కాన్ఫిడెన్స్ ని క్రియేట్ చేసింది ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.