English | Telugu

'లైగర్' ఫ్లాప్ పై రౌడీ స్టార్ రియాక్షన్..!

అభిమానులను ముద్దుగా రౌడీస్ అని పిలుచుకునే స్టార్ హీరో విజయ్ దేవరకొండ సెప్టెంబర్ 1న 'ఖుషి' సినిమాతో మెప్పించనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ తో రౌడీ స్టార్ బిజీగా ఉన్నారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా 'లైగర్' సినిమా ఫ్లాప్ గురించి అడిగిన ప్రశ్నకు విజయ్ దేవరకొండ రియాక్ట్ అయ్యారు. ''జయాపజయాలతో సంబంధం లేకుండా నేను ప్రతీ కథను అద్భుతమైనదిగా ఉండేలానే చూసుకుంటాను. కానీ అనుకున్నట్లు ప్లానింగ్ ప్రకారం సినిమాను తెరకెక్కించకపోవటం వల్ల నా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.

ఉదాహరణకు మనం ఫ్రెండ్స్ కు ఏదైనా జోక్ ను వివరించేటప్పుడు సరిగ్గా వివరించకపోతే అది సరిగ్గా పండదు. నా సినిమాలు లైగర్, డియర్ కామ్రేడ్, నోటా వంటి విషయాల్లో ఇదే జరిగింది. డిఫరెంట్, బిగ్ కథలను ఎంచుకోవాలని అనుకుంటున్నా, కానీ కుదరలేదు. సినిమా సమయంలో బిజినెస్ పరంగానూ ఒత్తిడి ఉంటుంది. ఓ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోతే సొంత థియేటర్ ఉన్న వ్యక్తిగా దాని ప్రభావం ఎలా ఉంటుందనేది నాకు తెలుసు'' అన్నారు.

మహానటి తర్వాత విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన చిత్రం ఖుషి. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించింది. శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. మజిలీ తర్వాత శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత నటించింది. సమంతకు నేనొక పెద్ద ఫ్యాన్ అని చెప్పిన విజయ్ దేరవకొండ.. ఆమెతో కలిసి నటించటం గ్రేట్ ఎక్స్ పీరియెన్స్ అని తప్పకుండా సినిమా అందరికీ నచ్చుతుందని పేర్కొన్నారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.