English | Telugu

విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో సామ్ లైవ్ పెర్ఫామెన్స్‌

రౌడీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌, స‌మంత జంట‌గా నటించిన లేటెస్ట్ మూవీ 'ఖుషి'. శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది. సెప్టెంబ‌ర్ 1న సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సినిమాపై ఇటు విజ‌య్ దేవ‌ర‌కొండ‌, అటు స‌మంత ఎన్నో ఆశ‌ల‌ను పెట్టుకున్నారు. లైగ‌ర్‌తో పాన్ ఇండియా స్టార్‌గా ఎదుగుతామ‌ని ఆశ‌ప‌డ్డ విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు ఆ సినిమా షాక్ ఇచ్చింది. దీంతో త‌ను ఖుషి సినిమా స‌క్సెస్ కావాల‌ని బ‌లంగా కోరుకుంటున్నారు. మ‌రో వైపు స‌మంత ఏడాది పాటు సినిమాల‌కు దూరంగా ఉండ‌టానికి నిర్ణ‌యించుకుంది. ఆమెను ఫ్యాన్స్‌, ప్రేక్ష‌కులు మ‌ర‌చిపోకూడ‌ద‌ని అనుకుంటే 'ఖుషి' సినిమా హిట్ కావాల్సిందే.

'ఖుషి' మూవీ రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతుంది. సెప్టెంబ‌ర్ 1న విడుద‌లంటే రెండు వారాల వ్య‌వ‌ధి మాత్రమే. దీంతో ఎంటైర్ యూనిట్ సినిమా ప్రమోష‌న్స్‌తో బిజీగా ఉన్నారు. ఇప్ప‌టికే విజ‌య్ దేవ‌ర‌కొండ‌, స‌మంత ఇంట‌ర్వ్యూను కంప్లీట్ చేశారు. ఈ నేప‌థ్యంలో ఓ ఆస‌క్తిక‌ర‌మైన వార్తొక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. అదేంటంటే.. 'ఖుషి' సినిమా మ్యూజికల్ ఈవెంట్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, స‌మంత క‌లిసి లైవ్ పెర్ఫామెన్స్ ఇవ్వ‌బోతున్నార‌ట‌. నిజంగా స్టేజ్‌పై ఈ జోడీ పాట‌కు డాన్స్ వేస్తే.. అది సోషల్ మీడియాలో ఓ రేంజ్‌గా వైర‌ల్ అవుతుంద‌నే సంగ‌తి తెలిసిందే.

శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్ సినిమాను నిర్మిస్తున్నారు. రీసెంట్‌గా రిలీజైన ఈ సినిమా ట్రైల‌ర్ అంచ‌నాల‌ను మ‌రింత‌గా పెంచేసింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న అబ్బాయి, అమ్మాయి మ‌ధ్య వ‌చ్చే మ‌నస్ప‌ర్ధ‌లకు కార‌ణాలేంట‌నే పాయింట్‌తో 'ఖుషి' సినిమాను తెర‌కెక్కించిన‌ట్లు తెలుస్తోంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.