English | Telugu

మరో టాలెంటెడ్ టాలీవుడ్ డైరెక్టర్ తో ధనుష్ మూవీ!

తమిళ హీరో ధనుష్ తెలుగు దర్శకులతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నాడు. ఇప్పటికే వెంకీ అట్లూరి దర్శకత్వంలో సార్, శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో కుబేర చేసి ఆకట్టుకున్నాడు. ఇప్పుడు మరో టాలీవుడ్ డైరెక్టర్ తో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆ దర్శకుడు ఎవరో కాదు.. వేణు ఊడుగుల.

2018లో వచ్చిన 'నీదీ నాదీ ఒకే కథ'తో దర్శకుడిగా పరిచయమై.. మొదటి సినిమాతోనే తన ప్రతిభను చాటుకున్నాడు వేణు. ఆ తర్వాత నాలుగేళ్లకు అంటే 2022లో తన రెండో సినిమా 'విరాట పర్వం'తో ప్రేక్షకులను పలకరించాడు. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం, బాక్సాఫీస్ దగ్గర కాసులు మాత్రం కురిపించలేకపోయింది. 'విరాట పర్వం' వచ్చి మూడేళ్లు దాటినా ఇంతవరకు వేణు తన కొత్త సినిమాని ప్రకటించలేదు. మధ్యలో నాగచైతన్య, సూర్య వంటి హీరోల పేర్లు వినిపించాయి కానీ.. అందులో ఏదీ కార్యరూపం దాల్చలేదు. ఎట్టకేలకు ఇన్నాళ్లకు దర్శకుడిగా వేణు మూడో సినిమా ఓకే అయినట్లు సమాచారం. వేణు చెప్పిన విభిన్న కథకు ధనుష్ ఇంప్రెస్ అయ్యాడట. ఈ ప్రాజెక్ట్ ని యూవీ క్రియేషన్స్ నిర్మించనుందట. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.

దర్శకుడిగా మూడో సినిమాకి చాలా సమయం తీసుకున్న వేణు ఊడుగుల.. ఈ గ్యాప్ లో నిర్మాతగా మారడం విశేషం. ఈటీవీ విన్ తో కలిసి 'రాజు వెడ్స్ రాంబాయి' అనే సినిమాని ఆయన నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంతో సాయిలు కంపాటి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.