English | Telugu

వెంకటేష్ రెండో కూతురి ఎంగేజ్ మెంట్.. చిరు, మహేష్ హాజరు

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మొదటి నుంచి లోప్రొఫైల్ మెయింటైన్ చేసే నటుడు ఎవరైనా ఉన్నారా అంటే అది ఒక్క విక్టరీ వెంకటేష్ మాతమ్రే అని చెప్పవచ్చు. తన కెరీర్ బిగినింగ్ నుంచి ఆయన ఇదే సూత్రాన్ని పాటిస్తూ వస్తున్నాడు. సినిమా వేరు ఫ్యామిలీ వేరు అన్న రీతిలో ఆయన లైఫ్ స్టైల్ ఉంటుంది. అందుకు నిదర్శనంగా తన ఇన్ని సంవత్సరాల సినీ జీవితంలో ఎక్కడ కూడా ఆయన ఫ్యామిలీ గురించిఎక్కడ మాట్లాడలేదు. ఎలాంటి న్యూస్ బయటికి కూడా రాదు. అంత పర్ఫెక్ట్ గా ఆయన ఉంటాడు. ఇప్పుడు అదే పర్ఫెక్ట్ తో తన రెండో కూతురు నిశ్చితార్దాన్ని జరిపించి అందరికి వెంకటేశ్ అంటే ఏంటో మరో సారి చాటి చెప్పాడు. సొసైటీ లో కొంచంపేరు ఉన్న వాళ్ళు, కొంచం డబ్బు ఉన్న వాళ్ళే తమ ఇళ్లల్లో జరిగే ఫంక్షన్కిఒక రేంజ్ లో హడావిడి చేస్తూ నానా హంగామానిసృష్టిస్తారు. కానీ ఒక సినిమా హీరోగా స్టార్ స్టేటస్ హోదా ఉన్న వెంకటేష్ మాత్రం వాళ్లందరికీ భిన్నంగా చాలా సింపుల్ గా తన కూతురు నిశ్చితార్థం జరిపించాడు.

విజయవాడకి చెందిన ఒక డాక్టర్ కుటుంబానికి చెందిన అబ్బాయితో వెంకటేష్ రెండో కూతురు హయవాహిని పెళ్లి నిశ్చయమయ్యింది. నిన్న చాలా అతి కొద్దిమంది అతిధుల సమక్షంలో హైదరాబాద్లో ఆ ఇద్దరి ఎంగేజ్ మెంట్ జరిగింది. వెంకటేష్ కి అత్యంత ఆప్తులు సినీ రంగానికి చెందిన అగ్ర హీరోలు అయిన చిరంజీవి,మహేష్ బాబు లు సతి సమేతంగా ఆ వేడుకకి హాజరయ్యారు . అలాగే రానా, నాగ చైతన్య లు కూడా ఫంక్షన్ చివరి వరకు ఉండి అన్ని కార్యక్రమాలని దగ్గరుండి మరి చూసుకున్నారు. అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఆ పిక్స్ లో చిరంజీవి అండ్ మహేష్ బాబు లు కాబోయే వధూవరువులిద్దరని ఆశీర్వదించడం ఉంది. అలాగే నూతన జంట మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా సూపర్ గా ఉన్నారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.