English | Telugu

వెంకటేష్ "సావిత్రి" 40 కోట్లు

విక్టరీ వెంకటేష్ హీరోగా, తేజ దర్శకత్వంలో,సురేష్ ప్రొడక్షన్స్పతాకంపై, డి.సురేష్‍ బాబు "సావిత్రి" అనే చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.ఈ చిత్రంలో త్రిష హీరోయిన్ గా నటిస్తూందని సమాచారం.ఈ చిత్రానికి నలభై కోట్ల రూపాయల భారీబడ్జెట్ ఖర్చవుతుందని సినీ వర్గాలంటున్నాయి.విక్టరీ వెంకటేష్ సినీ జీవితంలోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా ఈ "సావిత్రి" చిత్రాన్ని అభివర్ణించవచ్చు. ఈ చిత్రంలో హీరో వెంకటేష్ ఇదివరకెన్నడూ నటించని ఒక వైవిధ్యభరితమైన పాత్రలో నటించనున్నారని తెలిసింది.ఇటీవల విశాఖపట్టణంలోని రామానాయుడు స్టుడియోలో పూజా కార్యక్రమాలు మొదలైన ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మార్చ్ 12 వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.