English | Telugu

వెంకీ, రవితేజల మల్టీస్టారర్

టాలీవుడ్ లో మల్టీస్టారర్ సినిమా అనగానే అభిమానులకు ముందుగా గుర్తుకు వచ్చే హీరో విక్టరీ వెంకటేష్. ఎలాంటి బేషజాలు లేకుండా స్టొరీ బాగుంటే చిన్న హీరోతో కూడా కలిసి నటించడానికి రెడీగా వుంటారు. అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మల్టీస్టారర్ సినిమాలు వుంటాయా అని అందరూ అనుకుంటున్న సమయంలో “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు”తో మహేష్ తో కలిసి మల్టీ స్టారర్ చిత్రాల పద్దతిని పునఃప్రారంభించాడు వెంకటేష్. తరువాత వెంటనే రామ్ తో నవ్వుల “మసాలా” అందించాడు. ఇక ఇప్పుడు పవర్ స్టార్ తో కలిసి 'గోపాల గోపాల' అంటూ అభిమానులను అలరించడానికి సిద్దమవబోతున్నాడు. లేటెస్ట్ గా మాస్ మహారాజా రవితేజతో కలిసి మరో మల్టీస్టారర్‌కి సిద్ధమవుతున్నాడు వెంకటేష్. వీరు పోట్ల డైరెక్షన్‌లో తెరకెక్కనున్న ఈమూవీ స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ సినిమా సంక్రాంతి తరువాత సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.