English | Telugu

మెగా కోరికను మెగా మేనల్లుడు తీరుస్తాడా?

అక్టోబర్ 18 మెగా అభిమానులకు పండుగ రోజు కాబోతోంది. మెగా అభిమానుల కోరికను మెగా మేనల్లుడు సాయిధర్మతేజ ఈ రోజున తీర్చబోతున్నాడు. గత కొన్ని నెలలుగా మెగా ఫ్యామిలీని మొత్తం ఓకే వేదికపై చూడాలని అనుకుంటున్న అభిమానుల కోరిక తీరడంలేదు. కానీ ఈ సారి దానిని మెగా మేనల్లుడు తప్పక తీరుస్తాడని అనుకు౦టున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాయిధర్మతేజ తొలి సినిమా లంచ్ లో చిరుతో కలిసి మెరిశాడు. ఆ తరువాత ఏ మెగా ఫంక్షన్ కి ఆయన హాజరుకాలేదు. రీసెంట్ గా జరిగిన రామ్ చరణ్ గోవిందుడు ఆడియోకి మెగా ఫ్యామిలీ మొత్తం కలిసి వచ్చిన పవన్ లేకపోవడం అభిమానులను నిరాశకు గురిచేసింది. అందుకే ఈసారి అక్టోబర్ 18 జరగబోయే సాయిధర్మతేజ 'పిల్లా నువ్వు లేని జీవితం' ఆడియో ఫంక్షన్ కి మెగా ఫ్యామిలీతో పాటు పవన్ కూడా హాజరుకానున్నట్టు సమాచారం. చాలా రోజులు తరువాత చిరు, నాగబాబు, పవన్ ఓకే వేదికపైకి రానునున్నడంతో మెగా అభిమానులు ఏంతో ఆత్రుతగా ఈ ఫంక్షన్ కోసం ఎదురుచూస్తున్నారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.