English | Telugu

'వకీల్ సాబ్' సీక్వెల్ వచ్చేస్తోంది!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు 'వకీల్ సాబ్' సినిమాపై ప్రత్యేక అభిమానం ఉంటుంది. ఎందుకంటే రాజకీయాల కోసం సినిమాలకు కాస్త విరామం ఇచ్చిన పవన్.. 'వకీల్ సాబ్'తోనే రీఎంట్రీ ఇచ్చారు. హిందీ ఫిల్మ్ 'పింక్'కి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, బేవ్యూ ప్రాజెక్ట్స్ సంయుక్తంగా నిర్మించగా.. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు. 2021, ఏప్రిల్ 9న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకొని విజయం సాధించింది. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

'వకీల్ సాబ్-2' ఉంటుందని దర్శకుడు వేణు శ్రీరామ్ తాజాగా క్లారిటీ ఇచ్చారు. 'వకీల్ సాబ్' సినిమా విడుదలై రెండేళ్లు పూర్తయిన సందర్భంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించిన ఆయన.. వకీల్ సాబ్ సీక్వెల్ స్క్రిప్ట్ పై వర్క్ చేస్తున్నట్టు తెలిపారు. దీంతో పవర్ స్టార్ అభిమానులు తెగ సంబరపడుతున్నారు. అయితే స్క్రిప్ట్ పూర్తయినా ఈ సీక్వెల్ పట్టాలెక్కడానికి టైం పట్టే అవకాశముంది. ప్రస్తుతం పవన్ చేతిలో 'PKSDT'(వినోదయ సిత్తం రీమేక్), 'హరి హర వీరమల్లు', 'ఉస్తాద్ భగత్ సింగ్', 'ఓజీ' సినిమాలు ఉన్నాయి. ఇవి పూర్తి కావాలంటే ఏడాదికి పైగా పడుతుంది. దానికితోడు వచ్చే ఏడాది ఎన్నికలు ఉన్నాయి. ఈ లెక్కన వకీల్ సాబ్ సీక్వెల్ పట్టాలెక్కాలంటే 2024 తరువాతే అవుతుందేమో!.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.