English | Telugu

ఎన్నాళ్ళో వేచిన ఉదయం.. 'ఉస్తాద్ భగత్ సింగ్' మొదలైంది!

'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో రానున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం గత డిసెంబర్ లో లాంచ్ అయింది. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈరోజు నుంచి ప్రారంభమైంది. దీంతో 'ఎన్నాళ్ళో వేచిన ఉదయం' అంటూ సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నాడు దర్శకుడు హరీష్ శంకర్.

నిజానికి పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో రెండో సినిమా ప్రకటన ఎప్పుడో 2021 లోనే వచ్చింది. అప్పుడు 'భవదీయుడు భగత్ సింగ్' అనే టైటిల్ సినిమాని ప్రకటించారు. ఏడాది గడిచిపోయినా ఆ సినిమా పట్టాలెక్కలేదు. దీంతో అసలు ఆ సినిమా ఉందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే 2022 చివరిలో 'ఉస్తాద్ భగత్ సింగ్' గా టైటిల్ మార్చి ప్రకటించడంలో ఈ సినిమా ఉందని క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ఎట్టకేలకు పట్టాలెక్కింది. దర్శకుడిగా హరీష్ శంకర్ చివరి చిత్రం 'గద్దలకొండ గణేష్' 2019లో విడుదలైంది. పవన్ కళ్యాణ్ తో సినిమా ప్రకటన వచ్చి కూడా ఏడాదిన్నర దాటిపోయింది. ఆయన సెట్ లో అడుగుపెట్టి యాక్షన్ చెప్పడానికి కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఎదురుచూపులు ఫలించి ఇంత కాలానికి 'ఉస్తాద్ భగత్ సింగ్' షూటింగ్ మొదలైంది. ఆ విషయాన్ని తెలియజేస్తూ హరీష్ శంకర్ ట్విట్టర్ లో 'ఎన్నాళ్ళో వేచిన ఉదయం' సాంగ్ ని పోస్ట్ చేశాడు.

దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కి జోడిగా 'ధమాకా' బ్యూటీ శ్రీలీల నటిస్తున్నట్లు సమాచారం.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.