English | Telugu

సద్బ్రాహ్మణుడైన సత్య ప్రకాష్ భయపెట్టే విలన్ గా ఎలా మారాడు! 

-సత్య ప్రకాష్ అసలు ఎవరు!
-విలన్ గా ఎన్ని సినిమాలు
-సత్య ప్రకాష్ లా నటించే వాళ్ళు ఎంతోమంది
- ఎ ఎస్ రవికుమార్ చౌదరి ఏం చెప్పాడు

సిల్వర్ స్క్రీన్ పై ఇప్పుడంటే విలనిజం యొక్క మేనరిజం, నట ఉదృతి కొంచం తగ్గింది. కానీ ఒకప్పుడు హీరోలకి ఎంత మంది అభిమానులు, వీరాభిమానులు ఉండే వారో, విలన్ కి అదే విధంగా ఉండేవారు. అభిమాన హీరో హావభావాలతో యాక్ట్ చేసే వాళ్ళు కూడా ఎంత మంది ఉండేవారో, విలన్ హావభావాల ప్రదర్శన విషయంలో అభిమానులు తగ్గేదేలే అనే విధంగా ఉండే వారు. అటువంటి కొంత మంది విలన్స్ లో 'సత్య ప్రకాష్' కూడా ఒకరు.మూడు దశాబ్దాల క్రితమే వచ్చిన 'పోలీస్ స్టోరీ' మూవీలో సత్య అనే క్యారక్టర్ లో సత్య ప్రకాష్(Satya Prakash)ప్రదర్శించిన విలనిజాన్ని ప్రాక్టీస్ చేసినవాళ్లు కోకొల్లలు.

పోలీస్ స్టోరీ అనే కాదు చాలా సినిమాల్లోను తనదైన విలనిజంతో మెస్మరైజ్ చెయ్యడం సత్య రాజ్ స్పెషాలిటీ. రీసెంట్ గా 'ఓజి' లోను తన సత్తా చాటాడు. నెగిటివ్ రోల్స్ లో సత్య ప్రకాష్ మేనరిజం చాలా సపరేట్ గా ఉంటుంది. ఆవేశంతో ఒకే డైలాగ్ ని పదే పదే నొక్కి చెప్పడంలో సిద్ధహస్తుడు. అసలు సత్య ప్రకాష్ ప్రదర్శించే విలనిజం చూసి చిన్న, పెద్ద అనే తేడా లేకుండా భయపడేవాళ్ళు. దీంతో బయట కూడా అదే విధంగా ఉంటాడనే అభిప్రాయం చాలా మందిలో ఉండేది. కానీ సత్య ప్రకాష్ ఒక సద్బ్రాహ్మణుడు. నిత్యం వేద మంత్రాలు పఠిస్తూ సదరు మంత్రాల యొక్క విశిష్టిత గురించి పది మందికి చెప్తాడు. అసలు తాను ఒక వ్యక్తి తో మాట్లాడుతుంటే ముందుగా దైవం గురించే చర్చ ఉంటుంది. అంత దైవ భక్తుడు. మరి విలనిజాన్ని ప్రదర్శించడనికి ముఖ్య కారణం నటన మీద ఆసక్తి. నటనని కూడా దైవంగా భావించాడు. సత్య ప్రకాష్ గురించి ఈ వివరాలన్నింటినీ ప్రముఖ దర్శకులు 'ఏఎస్ రవికుమార్ చౌదరి'(as Ravikumar chowdary)ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది.

Also read: కాంతార చాప్టర్ 1 ,కొత్తలోక చాప్టర్ 1 ఎవరు గెలిచారు.. ఒక్క పాయింట్ తేడా అంతే

ఒడిస్సా కి చెందిన సత్య ప్రకాష్ తెలుగు చిత్ర పరిశమ్రలో బడా విలన్స్ రాజ్యమేలుతున్న రోజుల్లోనే సినీ రంగ ప్రవేశం చేసి తన సత్తా చాటాడు. తన మొదటి చిత్రం నాగార్జున హీరోగా 1991 లో వచ్చిన జైత్ర యాత్ర. తెలుగులో దాదాపుగా అందరి అగ్ర హీరోల సినిమాల్లో చేసాడు. ప్రతి సినిమాలో తన బ్రాండ్ ఆఫ్ విలనిజం మాత్రం పక్కా. మొత్తం పదకొండు భాషల్లో సుమారు 500 చిత్రాల వరకు చేసాడు. డైరెక్టర్ గాను ఎంట్రీ ఇచ్చి తన కుమారుడు తో 'ఊల్లాల్లా, ఊల్లాల్లా అనే చిత్రాన్ని తెరకెక్కించాడు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.