English | Telugu

యుద్ధ ట్యాంకర్లతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ర్యాలీ.. ఇదెక్కడి మాస్ రా మావ!

జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) నటించిన కొత్త సినిమా వస్తుందంటే చాలు.. ఆయన ఫ్యాన్స్ చేసే సెలబ్రేషన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి. ఇక ఇప్పుడు 'వార్-2' (War 2) విడుదల సందర్భంగా.. యూకే ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేసిన సెలబ్రేషన్స్ హాట్ టాపిక్ గా మారాయి. యూకే అధికారుల అనుమతి తీసుకొని.. 'వరల్డ్ వార్ 2'లో ఉపయోగించిన యుద్ధ ట్యాంకర్లతో ర్యాలీ నిర్వహించారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. అసలు రియల్ యుద్ధ ట్యాంకర్లతో ర్యాలీ చేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది అంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు.

ఎన్టీఆర్ నటించిన మొదటి బాలీవుడ్ ఫిల్మ్ 'వార్-2'. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

'వార్-2' కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ నెవెర్ బిఫోర్ సెలబ్రేషన్స్ చేస్తుండటం.. బాలీవుడ్ దృష్టిని సైతం ఆకర్షిస్తోంది. ఇటీవల మెల్బోర్న్ ఎన్టీఆర్ ఫ్యాన్స్.. నింగిలో స్మోక్ ఎఫెక్ట్ తో 'NTR WAR 2' అని రాయగా అది వైరల్ అయింది. ఇక ఇప్పుడు యూకే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏకంగా యుద్ధ ట్యాంకర్లతో ర్యాలీ చేశారు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ గురించి బాలీవుడ్ మీడియా కూడా తెగ మాట్లాడుతోంది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.