Read more!

English | Telugu

నిహారిక, చైతన్య మధ్య ఏం జరిగింది?

సినీ సెలబ్రిటీలకు సంబంధించిన ప్రతి విషయం వార్తే అవుతుంది. ఒకప్పుడు సెలబ్రిటీ జంటల మధ్య మనస్పర్థలు వచ్చాయనే విషయం సన్నిహితుల ద్వారా తెలిసేది. కానీ ఇప్పుడు ఈ సోషల్ మీడియా యుగంలో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నా, ఫోటోలు డిలీట్ చేసినా ఆ జంట మధ్య మనస్పర్థలు వచ్చాయనే అభిప్రాయానికి వచ్చేస్తున్నారు అందరూ. తాజాగా మెగా డాటర్ నిహారిక విషయంలోనూ అదే జరుగుతోంది.

చైతన్య జొన్నలగడ్డతో నిహారిక వివాహం 2020 డిసెంబర్ లో జరిగిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఈ జంట లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అయితే వీరి మధ్య విభేదాలు వచ్చాయని, విడిపోయే అవకాశముందని కొంతకాలం క్రితం వార్తలు చక్కర్లు కొట్టాయి. ఆ సమయంలో ఇద్దరు కలిసి హ్యాపీగా ఉన్న కొన్ని ఫోటోలను విడుదల చేసి.. ఆ వార్తలకు చెక్ పెట్టింది ఈ జంట. ఐతే ఇప్పుడు మరోసారి వీరి విడాకుల అంశం తెరపైకి వచ్చింది. దానికి కారణం ఇద్దరూ ఇన్‌స్టాగ్రామ్ లో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నారు. అంతేకాదు చైతన్య తన ప్రొఫైల్ నుంచి వారి వెడ్డింగ్ ఫోటోలను కూడా తొలగించాడు. దీంతో వీరిద్దరూ పూర్తిగా విడిపోవడానికి సిద్ధమయ్యారని, అందుకే సోషల్ మీడియాలో అన్ ఫాలో చేసుకొని ఫోటోలను సైతం డిలీట్ చేశారని ప్రచారం జరుగుతోంది. దీంతో అసలు నిహారిక, చైతన్య మధ్య ఏం జరిగిందనే చర్చ మొదలైంది. మరి వారి మధ్య నిజంగానే విభేదాలు వచ్చాయా? లేక ఇది కొందరి అత్యుత్సాహ ప్రచారమా? అనేది క్లారిటీ రావాల్సి ఉంది.