Read more!

English | Telugu

బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్న నిఖిల్!

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ 'కార్తికేయ-2' సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ అందుకున్నాడు. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం గతేడాది ఆగస్టులో విడుదలై రూ.120 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి ఘన విజయం సాధించింది. నార్త్ లో పెద్దగా అంచల్లేకుండా విడుదలైన ఈ చిత్రం అక్కడ కూడా మంచి వసూళ్లు రాబట్టడం విశేషం. ఈ మూవీతో నిఖిల్ పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాదు తాజాగా జాతీయస్థాయి అవార్డుని సైతం సొంతం చేసుకున్నాడు.

2022కి గాను తాజాగా ఐకానిక్ గోల్డ్ అవార్డ్స్ ను ప్రకటించారు. అందులో పాపులర్ ఛాయస్ లో 'కార్తికేయ-2'కి గాను బెస్ట్ యాక్టర్ గా నిఖిల్ అవార్డును గెలుచుకున్నాడు. సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగిన ఐకానిక్ గోల్డ్ అవార్డుల వేడుకల్లో నిఖిల్ ఈ అవార్డును అందుకున్నాడు. ఈ వేడుకలో 'కార్తికేయ-2' నిర్మాత అభిషేక్ అగర్వాల్, ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ తదితరులు పాల్గొన్నారు. అవార్డు అందుకున్న సందర్భంగా తన సంతోషాన్ని పంచుకున్న నిఖిల్.. దర్శక నిర్మాతలకు కృతఙ్ఞతలు తెలిపాడు.

అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. కాలభైరవ ఈ చిత్రానికి సంగీతం అందించాడు.