Read more!

English | Telugu

'పుష్ప-2' టీజర్ కి ముహూర్తం ఫిక్స్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో రూపొందిన పాన్ ఇండియా మూవీ 'పుష్ప: ది రైజ్' 2021 డిసెంబర్ లో విడుదలై వరల్డ్ వైడ్ గా రూ.350 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి ఘన విజయం సాధించింది. ఇప్పుడు ఈ మూవీ రెండో భాగం 'పుష్ప: ది రూల్' పేరుతో రూపొందుతోంది. 'పుష్ప-2'పై పాన్ ఇండియా రేంజ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను రెట్టింపు చేసేలా ఈ చిత్రం నుంచి త్వరలో అదిరిపోయే అప్డేట్ రాబోతోంది.

అల్లు అర్జున్ పుట్టినరోజు కానుకగా ఏప్రిల్ 8న మూడు నిమిషాల నిడివితో ఓ టీజర్ విడుదల చేయాలని మూవీ టీమ్ భావిస్తోందట. సినిమా కాన్సెప్ట్ ని తెలిపేలా అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలతో ఈ టీజర్ ని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీజర్ కట్ పూర్తయిందని, ప్రస్తుతం మ్యూజిక్ వర్క్ జరుగుతుందని సమాచారం. దీంతో పుష్ప-2 కాన్సెప్ట్ టీజర్ ఏ రేంజ్ లో ఉంటుందా అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.