English | Telugu

టాలీవుడ్ కి కొత్త సెన్సార్ అధికారి వచ్చారు

తెలుగు ఇండస్ట్రీ వర్గాలలో ప్రస్తుతం కొంతమంది చాలా సంతోషంగా వున్నారు. ఈ సంతోషానికి కారణం ఏంటో తెలుసా.. హైదరాబాద్ ప్రాంతీయ సెన్సార్ బోర్డు అధికారి ధనలక్ష్మి స్థానంలో కొత్త అధికారి రావడమే. ఎందుకంటే ఇంతకాలం ఈమె వలన చాలా మంది సినీ నిర్మాతలు, దర్శకులు, హీరోలు చాలా ఇబ్బందులు పడ్డారు. అనవసరపు కటింగులు, సరైన విధంగా సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకుండా ముప్పుతిప్పలు పెట్టేదంటూ వార్తలు వినిపించాయి. ఈమె ప్రవర్తనపై మంచు ఫ్యామిలీ, రాంగోపాల్ వర్మ వంటి వారు విమర్శలు కూడా చేశారు. అయితే ఇపుడు ఈమె స్థానంలో విజయ్ కుమార్ రెడ్డిని నియమించారు. విజయ్ కుమార్ గతంలో ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మంత్రిత్వ విభాగంలో అనేక కీలకమైన ఉన్నత పదవులు నిర్వర్తించారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.