English | Telugu

ఆహుతి ప్రసాద్‌ కు అనారోగ్యం

సాయికుమార్ తండ్రి మనవడి పెళ్లి మరుసటి రోజే చనిపోగా, రెండ్రోజుల వ్యవధిలో సంగీత దర్శకుడు చక్రి మృతి చెందారు. ఈ వార్తలను విని టాలీవుడ్ కోలుకోక ముందే ఆహుతి ప్రసాద్ ఆస్పత్రి పాలయ్యారు. ఆయన అనారోగ్యంతో బాధపడుతూ తాజాగా ఆస్పత్రిలో చేరారు. వైద్యులు ఆహుతి ప్రసాద్‌కి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆస్పత్రిలో చేరిన ఆహుతి ప్రసాద్‌ని బంధువులు, స్నేహితులు, సినీ రంగానికి చెందిన వారు పరామర్శిస్తున్నారు. టాలీవుడ్లో ఆహుతి ప్రసాద్ గొప్ప నటుడు. తన నటనా చాతుర్యంతో తను నటించిన ప్రతి సినిమాకు కీలంగా నిలిచేవారు. చందమామ సినిమాకు ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్టుగా నంది అవార్డు కూడా అందుకున్న ఆహుతి ప్రసాద్ బెండు అప్పారావు, గులాబి, నిన్నేపెళ్లాడుతా, కొత్త బంగారు లోకం వంటి సినిమాల్లో చాలా మంచి పాత్రలు చేశారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.