English | Telugu

దసరా హీరో ఎవరు...?

దసరా హీరో ఎవరు...? అనే ప్రశ్న ఫిలిం నగర్ వర్గాలను పందేలు కాసుకునేలా చేస్తూంది. వివరాల్లోకి వెళితే ముందుగా మహేష్ బాబు హీరోగా, సమంత హీరోయిన్ గా, శ్రీనువైట్ల దర్శకత్వంలో రాబోతున్న "దూకుడు" సినిమా ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా మీద భారీ అంచనాలున్నాయి.

యన్ టి ఆర్ హీరోగా, శృతిహాసన్ హీరోయిన్ గా, బోయపాటి దర్శకత్వంలో, కె.యస్.రామారావు నిర్మిస్తున్న చిత్రం "ఊసరవెల్లి".ఈ చిత్రం మీద కూడా అంచనాలు బాగానే ఉన్నాయి. ఈ చిత్రం కథకు 70 లక్షలు ఇచ్చారని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం.

యువరత్న నందమూరి బాలకృష్ణ శ్రీరామచంద్రుడిగా, నయనతార సీతామహాసాధ్విగా, బాపుగారి దర్శకత్వంలో, యలమంచిలి సాయిబాబు నిర్మిస్తున్న "శ్రీరామరాజ్యం" చిత్రం మీద కూడా అందరికీ బలమైన అంచనాలున్నాయి. అదీగాక ఈ చిత్రాన్ని బాపు తన ప్రాణస్నేహితుడు ముళ్ళపూడికి ఇస్తున్న నివాళిగా భావించవచ్చు. ఈ చిత్రాన్ని ఆయనకు అంకితమిచ్చారు.

ఇక నాగచైతన్య హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా, అజయ్ భూయాన్ దర్శకత్వంలో, కామాక్షీ కళా మూవీస్ పతాకంపై, డి.విశ్వచందన్ రెడ్డి నిరిస్తున్న "దడ" చిత్రం మీద కూడా అంచనాలు బాగానే ఉన్నాయి.

యువసామ్రాట్ అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తూ, విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో, నిర్మిస్తున్న తెలంగాణా సాయుధ రైతాంగ పోరాట యోధుడు రాజన్న జీవిత కథే "రాజన్న" చిత్రం. ఈ విభిన్న కథా చారిత్రాత్మక చిత్రం మీద కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి... మరి ఇంతమందిలో ఎవరి సినిమా సూపర్ హిట్టయి దసరా పండగ హీరోగా నిలుస్తారో...మీరు ఊహించి మీ అభిప్రాయం మాకు తెలియజేయండి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.