English | Telugu

టాలీవుడ్‌ హీరోలంతా ఎక్కడ ఉన్నారో, ఏం చేస్తున్నారో తెలుసా?

సెప్టెంబర్‌లో మొదటి విజయాన్ని నమోదు చేసిన సినిమా ‘లిటిల్‌ హార్ట్స్‌’. ఆ తర్వాతి వారంలో మరో భారీ విజయాన్ని అందుకున్న సినిమా ‘మిరాయ్‌’. చివరి వారంలో వచ్చిన ‘ఓజీ’ బ్లాక్‌బస్టర్‌ సాధించి సెప్టెంబర్‌ నెలను విజయాలతో నింపేసింది. అదే పరంపరను డబ్బింగ్‌ సినిమా ‘కాంతార చాప్టర్‌1’ అక్టోబర్‌లోనూ కొనసాగిస్తోంది. చాలా కాలం తర్వాత వరస విజయాలతో టాలీవుడ్‌ కళకళలాడుతోంది. ఇదే ఊపులో కొత్త సినిమాలను థియేటర్లకు తరలించాలన్న ఉద్దేశంతో టాలీవుడ్‌ హీరోలు తమ షూటింగ్స్‌ స్పీడును పెంచారు. తెలుగు రాష్ట్రాలతోపాటు విదేశాలలోని వివిధ లొకేషన్లలో తమ తమ సినిమాల షూటింగ్స్‌తో హీరోలంతా ఎంతో బిజీగా ఉన్నారు. అయితే ఎవరు ఎక్కడ ఉన్నారు, ఏ సినిమా షూటింగ్‌లో ఉన్నారు అనే విషయాల గురించి తెలుసుకుందాం.

రామ్‌ హీరోగా మహేష్‌బాబు దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆంధ్రా కింగ్‌ తాలూకా’ చిత్రం షూటింగ్‌ హలో నేటివ్‌ స్టూడియోలో జరుగుతోంది. అలాగే నాని, శ్రీకాంత్‌ ఓదెల కాంబినేషన్‌లో చేస్తున్న ‘ప్యారడైజ్‌’ షూటింగ్‌ కూడా అక్కడే జరుగుతోంది. అంతే కాదు శర్వానంద్‌ హీరోగా సంపత్‌ నంది తెరకెక్కిస్తున్న ‘భోగి’ చిత్రం షూటింగ్‌ కోసం హలో నేటివ్‌ స్టూడియోలోనే భారీ సెట్‌ నిర్మాణం జరుగుతోంది. త్వరలోనే ఈ సెట్‌లో షూటింగ్‌ స్టార్ట్‌ అవుతుంది.

ప్రభాస్‌తో మారుతి చేస్తున్న ‘రాజాసాబ్‌’ చిత్రానికి సంబంధించిన పాటల చిత్రీకరణ యూరప్‌లో జరుగుతోంది. చిరంజీవి, అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘మన శంకరవరప్రసాద్‌గారు’ చిత్రం షూటింగ్‌ అన్నపూర్ణ సెవెన్‌ ఎకర్స్‌లో చేస్తున్నారు. పవన్‌కళ్యాణ్‌, హరీష్‌ శంకర్‌ కాంబో మూవీ ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ షూటింగ్‌ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. అయితే పవన్‌కళ్యాణ్‌ ఇప్పటికే తనకు సంబంధించిన షూటింగ్‌ పార్ట్‌ కంప్లీట్‌ చేశారు. ప్రస్తుతం బ్యాలెన్స్‌ ఉన్న సీన్స్‌ను చిత్రీకరిస్తున్నారు. మహేష్‌, రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ సినిమా షూటింగ్‌ రామోజీ ఫిలింసిటీలో చేస్తున్నారు. అల్లు అర్జున్‌ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ షూటింగ్‌ ముంబైలో జరుగుతోంది.

అఖిల్‌ అక్కినేని హీరోగా కిశోర్‌ తెరకెక్కిస్తున్న ‘లెనిన్‌’ షూటింగ్‌ భూత్‌ బంగ్లాలో జరుగుతోంది. నాగచైతన్య, కార్తీక్‌ దండు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం షూటింగ్‌ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. విజయ్‌ సేతుపతి, పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా షూటింగ్‌ కూడా అక్కడే చేస్తున్నారు. ప్రశాంత్‌ వర్మ నిర్మాణంలో పూజ కొల్లూరు దర్శకత్వంలో రూపొందుతున్న లేడీ ఓరియంటెడ్‌ మూవీ ‘మహాకాళి’ షూటింగ్‌ ముచ్చింతలలో జరుగుతోంది. ఇలా టాలీవుడ్‌లోని హీరోలంతా షూటింగులలో నిమగ్నమై ఉన్నారు. చాలా కాలం తర్వాత ఒకేసారి వివిధ ప్రాంతాల్లో షూటింగ్స్‌ జరుగుతుండడంతో రాబోయే కాలంలో మరిన్ని మంచి సినిమాలు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.