English | Telugu

దీపికా పదుకునే కి కౌంటర్ ఇచ్చిన స్మృతి ఇరానీ 

స్టార్ హీరోయిన్ 'దీపికా పదుకునే'(Deepika Padukone)వర్కింగ్ అవర్స్ విషయంలో కొన్ని కండిషన్స్ పెట్టిందని, దాని వల్లనే కల్కి పార్ట్ 2(Kalki part 2),స్పిరిట్(Spirit) వంటి చిత్రాలని నుంచి ఆమెని తప్పించారనే వార్తలు గత కొన్ని రోజుల నుంచి సినీ సర్కిల్స్ లో వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్నీక్రమంగా అందరు మర్చిపోతున్నా కూడా, ఎవరో ఒకరు మళ్ళీ ఈ అంశం గురించి ప్రస్తావనకి తీసుకొస్తూనే ఉన్నారు.

తాజాగా దీపికా పని గంటలపై ప్రముఖ నటి కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ(Smriti Irani)మాట్లాడుతు దీపికా రెండు భారీ ప్రాజెక్ట్స్ నుంచి వైదొలగడమనేది పూర్తిగా ఆమె వ్యక్తిగత సమస్య. కాకపోతే ఆరిస్టులు ఎప్పుడు నిర్మాతల కోణం నుంచే ఆలోచిస్తూ ఉండాలి. అందుకే నేను ఎప్పుడు నిర్మాతలకి లాభాలు రావాలని అంకిత భావంతో పని చేశాను. సీరియల్స్ లో నటిస్తున్న సమయంలోనే ఇద్దరు పిల్లలకి తల్లినయ్యాను. ఆ సమయంలో కూడా నా వల్ల నిర్మాతలకి ఇబ్బంది రాకూడదనే షూటింగ్ లో పాల్గొన్నాను. నిర్మాత బాగుండాలని కోరుకోవడం నటిగా నా బాధ్యత అని తెలిపింది. ఇప్పుడు ఈ మాటలు సినీ సర్కిల్స్ లో వైరల్ గా మారాయి.

ఢిల్లీ కి చెందిన స్మృతి ఇరానీ 2000 వ సంవత్సరంలో స్టార్ ప్లస్ లో ప్రసారమైన ఆతిష్ 'అండ్ హమ్ హైన్ కల్ ఆజ్ ఔర్ కల్' అనే ధారావాహిక తో నటిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత బాలాజీ టెలీఫిల్మ్స్ నిర్మించిన 'క్యుంకీ సాస్ బి కభీ బహు థీ' లో 'తులసి విరానీ' అనే క్యారక్టర్ ని అద్భుతంగా పోషించి, బుల్లితెర ప్రేక్షకులకి అభిమాన నటిగా మారింది. ఎనిమిది సంవత్సరాలు కంటిన్యూగా ఆ ధారావాహిక ప్రసారం కావడం అప్పట్లో ఒక రికార్డు. ఇప్పుడు 'క్యుంకీ సాస్ బి కభీ బహు థీ' కి సీక్వెల్ వచ్చింది. స్టార్ ప్లస్ లో ప్రసారం ప్రసారమవుతుండగా స్మృతి ఇరానీ రెండు దశాబ్దాల తర్వాత మళ్ళీ 'తులసి విరానీ' క్యారక్టర్ లో తన సత్తా చాటుతుంది. ఈ ధారావాహిక కి సంబంధించిన ఒక ఇంటర్వ్యూ లోనే పని గంటల విషయం గురించి మాట్లాడింది.1998 ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్న స్మృతి మిస్ ఇండియా కిరీటానికి కొంచం దూరంలో నిలిచింది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.