English | Telugu

ది రాజాసాబ్ టీజర్ వచ్చేసింది..కాకపోతే తాత వైరు కొరికేసాడేమో చూడండి ఫ్యాన్స్ 

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas)అప్ కమింగ్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja Saab). హర్రర్ ఫాంటసీ నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రభాస్(Prabhas)చాలా ఏళ్ళ తర్వాత వింటేజ్ లుక్ తో కనిపిస్తుండటంతో పాటు, ఎంటర్ టైన్ మెంట్ ని కూడా ఒక రేంజ్ లో పండించనున్నాడు. దీంతో రాజాసాబ్ పై అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోను భారీ అంచనాలు ఉన్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి జె విశ్వప్రసాద్(Tj Viswaprasad)భారీ వ్యయంతో నిర్మిస్తుండగా మారుతీ(Maruthi)దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.

ఈ రోజు హైదరాబాద్ లోని 'ప్రసాద్ ఐమాక్స్'(I Max)వేదికగా ప్రభాస్ అభిమానుల మధ్య 'రాజాసాబ్' టీజర్ రిలీజ్ అయ్యింది. సుమారు రెండు నిమిషాల పది సెకన్ల నిడివి ఉన్న టీజర్ లో ఒక భారీ అడవి లాంటి ప్రాంతంలో చుట్టూ చెట్ల మధ్య ఉన్న ఒక ఇంటిని చూపించారు. ఆ తర్వాత వాయిస్ ఓవర్ తో 'ఈ ఇల్లు నా దేహం, ఈ సంపద నా ప్రాణం. నా తదనంతరం కూడా నేనే అనుభవిస్తాను అని చెప్పడంతో టీజర్ స్టార్ట్ అయ్యింది. ప్రభాస్ క్యారక్టర్ ని ఎంటర్ టైన్ మెంట్ అండ్ ప్రేమ యాంగిల్ లో కూడా చూపించారు. దీన్ని బట్టి మేకర్స్ మొదట నుంచి చెప్తునట్టుగా హర్రర్ ఎంటర్ టైన్ మెంట్ కోణంలో మూవీ నడుస్తుందనే విషయం అర్ధమవుతుంది. ప్రభాస్ లుక్ కొత్తగా ఉండటంతో పాటు, డైలాగ్ డెలివరీ కూడా ఒక రేంజ్ లో ఉంది. ప్రభాస్ నోటి నుంచి వచ్చిన పలు మాటలు నవ్వులని పూయించాయి. ముఖ్యంగా టీజర్ చివర్లో తాత వైరు కొరికేసాడేమో చూడండ్రా అని ఏడుస్తూ చెప్పిన డైలాగ్ సూపర్. కొన్ని కీలక సన్నివేశాలు కూడా చూపించడంతో, చిత్ర కథ ఏమై ఉంటుందనే ఆసక్తి అందరిలో ఉంది. విజువల్ గా కూడా ఒక కొత్త ప్రపంచాన్ని చూపించబోతున్నారనే విషయం కూడా టీజర్ ద్వారా అర్ధమవుతుంది. థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఒక రేంజ్ లో ఉంది. డిసెంబర్ 5 న రాజాసాబ్ వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.

నిది అగర్వాల్, మాళవిక మోహనన్, సంజయ్ దత్, సముద్ర ఖని, వి టి వి గణేష్ వంటి నటులు కూడా టీజర్ లో కనపడి తమ పాత్రలపై ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించారు. ఇక టీజర్ రిలీజ్ సందర్భంగా అభిమానులు ఐ మాక్స్ వద్ద ప్రభాస్ భారీ కట్ అవుట్ ని ఏర్పాటు చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.


పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.