English | Telugu

యాభై రూపాయల జీతం ఇచ్చారు.. మరి ఇప్పుడు పాన్ వరల్డ్ మూవీ తీస్తున్నాడుగా!

'బాహుబలి' సిరీస్ తో తెలుగు సినిమా పరిశ్రమకి పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చి పెట్టిన దర్శక ధీరుడు రాజమౌళి(ss Rajamouli). ఆర్ ఆర్ ఆర్(RRR)తో అంతర్జాతీయ స్థాయిలో ఆస్కార్ ని కూడా తెచ్చిపెట్టాడు. ప్రస్తుతం మహేష్ బాబు(Mahesh Babu)తో తన కొత్త చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. అమెజాన్ అడవుల నేపథ్యంలో అడ్వెంచర్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ ఇండియన్ చిత్ర పరిశ్రమలోనే హయ్యస్ట్ బడ్జెట్ తో రుదిద్దుకోబోతుంది. ఇటీవలే ఫస్ట్ షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న ఈ మూవీ త్వరలోనే రెండో షెడ్యూల్ ని జరుపుకోనుంది.

రాజమౌళి రీసెంట్ గా నిన్న జరిగిన నాగార్జున(Nagarjuna),ధనుష్(Dhanush)ల 'కుబేర'(Kuberaa)మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరవ్వడం జరిగింది. ఈ సందర్భంగా రాజమౌళిని ఉద్దెశించి ఈవెంట్ కి వ్యాఖ్యాతగా వ్యవహరించిన సుమ మాట్లాడుతు 'మీ ఫస్ట్ శాలరీ ఎంత అని అడిగింది. దీంతో రాజమౌళి సుమతో యాభై రూపాయిలని చెప్పాడు. రాజమౌళి చెప్పిన ఈ మాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Ntr)కెరిరీలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన 'స్టూడెంట్ నెంబర్ వన్' చిత్రం ద్వారా రాజమౌళి సినీ రంగానికి పరిచయమయ్యాడు. సినిమా రంగంలోకి రాక ముందు సీరియల్స్ కి కూడా వర్క్ చేసాడు.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.