English | Telugu

టెన్షన్ లో 'రాజా సాబ్' మూవీ టీమ్.. షూటింగ్ కష్టమేనా..?

తెలుగు సినీ కార్మికులు సమ్మె విరమించడంతో మళ్ళీ షూటింగ్ లు మొదలయ్యాయి. అయితే ప్రభాస్ హీరోగా నటిస్తున్న 'ది రాజా సాబ్' షూటింగ్ మళ్ళీ మొదలవుతుందా? అసలు సినీ కార్మికులు ఈ షూటింగ్ కి హాజరవుతారా లేదా? అనే సస్పెన్స్ నెలకొంది. ఎట్టకేలకు ఇప్పుడు ఆ సస్పెన్స్ కి తెరపడినట్లు తెలుస్తోంది.

మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న 'రాజా సాబ్' కొత్త షెడ్యూల్ ను రేపటి(ఆగస్టు 25) నుంచి ప్లాన్ చేశారు. అయితే ఈ షెడ్యూల్ స్టార్ట్ అవుతుందా లేదా? అనే టెన్షన్ మూవీ టీంలో నెలకొంది.

సినీ కార్మికుల సమ్మె సమయంలో ఈ చిత్ర నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఫెడరేషన్‌కు లీగల్ నోటీసులు ఇచ్చారు. సమ్మె విరమించిన తర్వాత ఆ నోటీసులు విత్ డ్రా చేసుకుంటానని ప్రకటించారు. అయినప్పటికీ కొన్ని కార్మిక సంఘాలు విశ్వప్రసాద్ పై గుర్రుగా ఉన్నాయట. దీంతో 'రాజా సాబ్' షూటింగ్ ఉంటుందా లేదా? అని ప్రభాస్ ఫ్యాన్స్ లోనూ టెన్షన్ మొదలైంది.

అయితే 'రాజా సాబ్'కి లైన్ క్లియర్ అయిందని, రేపటి నుంచి కొత్త షెడ్యూల్ మొదలవుతుందని సమాచారం. ఈనెలాఖ‌రు వ‌ర‌కూ అజీజ్ న‌గ‌ర్ లో జరగనున్న ఈ షెడ్యూల్ లో ప్ర‌భాస్ పై కొన్ని కీల‌క‌ స్న‌నివేశాలను చిత్రీకరించనున్నారు. సెప్టెంబ‌రు 17 నుంచి కేర‌ళ‌లో ప్ర‌భాస్ ఇంట్ర‌డ‌క్ష‌న్ సాంగ్‌ షూట్ చేయనున్నారు. ఆ తర్వాత విదేశాల్లో రెండు పాట‌లు చిత్రీక‌ర‌ణ‌ ఉంటుంది. దాంతో రాజాసాబ్ షూటింగ్ మొత్తం పూర్తవుతుంది.

'రాజా సాబ్'ని డిసెంబర్ 5న విడుదల చేయనున్నట్లు గతంలో మేకర్స్ ప్రకటించారు. అయితే ఇప్పుడు 2026 సంక్రాంతికి వాయిదా పడినట్లు వార్తలొస్తున్నాయి.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.