English | Telugu

ఆగిపోయిన ఎన్టీఆర్ కొత్త మూవీ.. దేవర-2 కాదు!

ఇటీవల 'వార్-2' అనే బాలీవుడ్ ఫిల్మ్ తో ప్రేక్షకులను పలకరించాడు జూనియర్ ఎన్టీఆర్. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ప్రస్తుతం ఎన్టీఆర్ చేతిలో పలు సినిమాలు ఉన్నాయి. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో చేస్తున్న 'డ్రాగన్' షూటింగ్ దశలో ఉంది. ఆ తర్వాత 'దేవర-2'తో పాటు త్రివిక్రమ్ ప్రాజెక్ట్, నెల్సన్ ప్రాజెక్ట్ లైన్ లో ఉన్నాయి. అలాగే యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ లో ఒక సోలో ఫిల్మ్ చేయాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఆగిపోయినట్లు ప్రచారం జరుగుతోంది.

యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన 'వార్-2'లో హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ స్క్రీన్ చేసుకున్నాడు. టాలీవుడ్ స్టార్స్ కి హిందీ సినిమాలు కలసి రావట్లేదు. పైగా సోలో మూవీ కూడా కాదు. దాంతో 'వార్-2'తో ఎన్టీఆర్ రిస్క్ చేస్తున్నాడనే అభిప్రాయాలు మొదట్లోనే వ్యక్తమయ్యాయి. అందుకు తగ్గట్టుగానే ఆగస్టు 14న విడుదలైన 'వార్-2'.. డివైడ్ టాక్ తో తెలుగులో ఎన్టీఆర్ స్టార్డమ్ కి తగ్గ వసూళ్లను రాబట్టలేకపోయింది. ఇదే ఇప్పుడు ఎన్టీఆర్ ను ఆలోచనలో పడేసినట్లు తెలుస్తోంది.

నిజానికి 'వార్-2'తో పాటు యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ లో ఎన్టీఆర్ ఓ సోలో ఫిల్మ్ కూడా కమిటై ఉన్నాడని గతంలో వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు ఆ సినిమా విషయంలో ఎన్టీఆర్ వెనక్కి తగ్గినట్లు వినికిడి. తన స్టార్డమ్ ని మ్యాచ్ చేయలేని హిందీ సినిమాలు చేయడం కంటే.. సౌత్ దర్శకులతో పాన్ ఇండియా వైడ్ గా సంచలనం సృష్టించే సినిమాలు చేయడం మంచిదనే అభిప్రాయానికి ఎన్టీఆర్ వచ్చాడట. అందుకే యశ్ రాజ్ ఫిల్మ్స్ తో ఎన్టీఆర్ సోలో ఫిల్మ్ ఉండకపోవచ్చని సమాచారం.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.