English | Telugu

టాలీవుడ్ స్టార్స్ కి షాకిచ్చేలా 'కాంతార-2' తెలుగు బిజినెస్!

టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు కూడా హిట్ టాక్ వస్తేనే తెలుగు రాష్ట్రాల్లో రూ.100 కోట్ల షేర్ రాబడుతుంటాయి. అలాంటిది ఓ డబ్బింగ్ సినిమాకి తెలుగు రాష్ట్రాల రైట్స్ కోసం వంద కోట్లు కోట్ చేస్తున్నారు మేకర్స్. ఆ సినిమా ఏదో కాదు.. కాంతార చాప్టర్-1.

రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'కాంతార'. హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ మూవీ 2022లో సైలెంట్ గా వచ్చి ఏకంగా రూ.400 కోట్ల గ్రాస్ రాబట్టి సంచలనం సృష్టించింది. తెలుగు రాష్ట్రాల్లోనూ రూ.30 కోట్ల షేర్ తో ఘన విజయం సాధించింది.

ఇప్పుడు కాంతారకి ప్రీక్వెల్ గా కాంతార చాప్టర్-1 రూపొందుతోంది. అక్టోబర్ 2న విడుదల కానున్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. దానిని దృష్టిలో పెట్టుకునే నిర్మాతలు తెలుగు రాష్ట్రాల రైట్స్ ని ఏకంగా వంద కోట్లకు కోట్ చేస్తున్నట్లు సమాచారం.

గతంలో హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన 'కేజీఎఫ్-2' కూడా తెలుగునాట రూ.75 కోట్ల బిజినెస్ చేస్తే అందరూ ఆశ్చర్యపోయారు. సీక్వెల్ హైప్ తో వచ్చిన ఆ మూవీ బాక్సాఫీస్ దగ్గర సంచలన వసూళ్లతో సత్తా చాటి.. తెలుగు రాష్ట్రాల్లో లాభాలు చూసింది.

ఇప్పుడు 'కాంతార చాప్టర్-1'కి ప్రీక్వెల్ హైప్ తో పాటు, డివోషనల్ టచ్ కూడా ఉండటంతో.. నైజాం రూ.40 కోట్లు, ఆంధ్రా రూ.45 కోట్లు, సీడెడ్ రూ.15 కోట్లు చొప్పున మొత్తం వంద కోట్లు కోట్ చేస్తున్నారట. 90 కోట్లకు అటుఇటుగా డీల్ క్లోజ్ అయ్యే అవకాశముంది అంటున్నారు. అదే జరిగితే తెలుగు రాష్ట్రాల్లో డబ్బింగ్ సినిమాల బిజినెస్ పరంగా సరికొత్త రికార్డు సృష్టించిన సినిమాగా 'కాంతార చాప్టర్-1' నిలుస్తుంది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.