English | Telugu

ఆ రికార్డు మహేష్‌ వల్లే సాధ్యమైంది!

`

కొన్ని సినిమాలు థియేటర్లలో రిలీజ్‌ అయి కలెక్షన్లపరంగా రికార్డులు సృష్టిస్తే.. మరికొన్ని సినిమాలు వివిధ మాధ్యమాల్లో వ్యూస్‌ని బట్టి కొత్త రికార్డులు క్రియేట్‌ చేస్తాయి. అలాంటి ఓ కొత్త రికార్డును సూపర్‌స్టార్‌ మహేష్‌ క్రియేట్‌ చేశారు. 8 సంవత్సరాల క్రితం రిలీజ్‌ అయిన ‘శ్రీమంతుడు’ ఇప్పుడు యూట్యూబ్‌లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. కొరటాల శివ దర్శకత్వంలో జి.మహేష్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, మైత్రి మూవీ మేకర్స్‌ పతాకాలపై నిర్మించిన ఈసినిమా అప్పట్లో థియేటర్లలో పెద్ద సంచలనమే సృష్టించింది.200+మిలియన్‌ వ్యూస్‌ సాధించిన తొలి తెలుగు సినిమాగా ‘శ్రీమంతుడు’ నిలిచింది.

‘శ్రీమంతుడు’ ఫుల్‌ మూవీని యూట్యూబ్‌లో హయ్యస్ట్‌ వ్యూస్‌తోపాటు జనం మెచ్చిన సినిమాగా నిలిచింది. ఈ ఘనత సాధించిన నేపథ్యంలో దర్శకనిర్మాతలతోపాటు మహేష్‌ ఫ్యాన్స్‌ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. రెగ్యులర్‌ సినిమాలకు భిన్నంగా ఒక గ్రామాన్ని దత్తత చేసుకోవడం అనే పాయింట్‌ మీద రూపొందించిన ఈ సినిమా ప్రేక్షకులకు విపరీతంగా ఆకట్టుకుంది. అంతేకాదు ఈ సినిమాలోని పాటలు కూడా ఎంతో ప్రజాదరణ పొందాయి. మహేష్‌, శృతి హాసన్‌, రాజేంద్రప్రసాద్‌, జగపతిబాబు, సుకన్య, సంపత్‌రాజ్‌, వెన్నెల కిశోర్‌, తులసి, సితార తదితరులు నటించిన ఈ సినిమాను కుటుంబ సమేతంగా అందరూ చూసి పెద్ద విజయాన్ని అందించారు. ఇప్పుడు యూ ట్యూబ్‌లోనూ తన సత్తా చాటుకుందీ బ్లాక్‌బస్టర్‌ మూవీ.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.