English | Telugu

గన్ పట్టిన క్లాస్ డైరెక్టర్.. ఇదెక్కడి కాంబినేషన్ రా మావా!

కొన్నిసార్లు ఊహించని కాంబినేషన్ లో సినిమాలు వస్తుంటాయి. ఇప్పుడు అలాంటి ఓ ఊహించని కాంబినేషనే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇంతకీ కాంబో ఎవరో కాదు.. యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ, దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్‌.

డీజే టిల్లు సినిమాతో బ్లాక్ బస్టర్‌ను అందుకొని యూత్ లో ఫుల్ క్రేజ్ సొంతం చేసుకున్న సిద్దు.. ప్రస్తుతం 'టిల్లు స్క్వేర్', 'తెలుసు కదా' వంటి సినిమాలు చేస్తున్నాడు. తాజాగా ఈ యంగ్ హీరో.. బొమ్మరిల్లు భాస్కర్‌ తో చేతులు కలిపాడు.

ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ మీద నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి వర్కింగ్ టైటిల్‌గా SVCC 37 అని ఫిక్స్ చేశారు. రీసెంట్‌గా ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగిన సంగతి తెలిసిందే.

తాజాగా ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైనట్లు ఓ స్ట్రైకింగ్ పోస్టర్‌తో అప్డేట్ ఇచ్చారు. ఈ పోస్టర్‌లో బొమ్మరిల్లు భాస్కర్, నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్, హీరో సిద్దు కనిపిస్తున్నారు.

'బొమ్మరిల్లు' వంటి క్లాసిక్ ఫిల్మ్ తో దర్శకుడిగా పరిచయమై ఆ సినిమా టైటిల్ నే ఇంటిపేరుగా మార్చుకున్న భాస్కర్.. పరుగు, ఆరెంజ్ వంటి సినిమాలతో ఆకట్టుకున్నాడు. 2013 లో వచ్చిన 'ఒంగోలు గిత్త' తర్వాత లాంగ్ బ్రేక్ ఇచ్చిన ఆయన.. 2021 లో 'మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్'తో మంచి కమ్ బ్యాక్ ఇచ్చాడు. భాస్కర్ కి క్లాస్ దర్శకుడిగా పేరుంది. అలాంటి డైరెక్టర్‌తో.. మాస్ ఇమేజ్ ఉన్న యూత్ సెన్సేషన్ సిద్దు సినిమా చేస్తుండటం ఆసక్తికరంగా మారింది. పైగా పోస్టర్ లో డైరెక్టర్ భాస్కర్ గన్ పట్టుకోవడం చూస్తుంటే ఇది ఆయన శైలి సినిమా కాదని అర్థమవుతోంది

మరోవైపు ఈ చిత్రం పూర్తిగా వినోదాత్మకంగా ఉంటుందని మేకర్లు తెలిపారు. త్వరలోనే మిగతా వివరాలను ప్రకటించనున్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.