English | Telugu

వివాదంలో స్టార్ హీరోయిన్.. మొత్తం ఆమే చేసిందా..?

మనిషికి ఆశ ఉండొచ్చు కానీ, దురాశ ఉండకూడదు. ఇప్పుడు ఆ దురాశే ఓ ప్రముఖ హీరోయిన్ కి శాపంగా మారింది అంటున్నారు. బాలీవుడ్ కి చెందిన ఒకరు.. ఓ ఫేమస్ హీరోయిన్ ని టార్గెట్ చేస్తూ, తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ పెట్టారు. "ఒక ఫేమస్ పర్సన్ వల్ల కొద్దిరోజులుగా ఇబ్బంది పడుతున్నాను. ఆమె టీమ్ మెంబర్స్ మరియు కుటుంబసభ్యులు స్టుపిడ్ గా, అన్ ప్రొఫెషనల్ గా ఉంటారు. సౌత్ ఇండియన్ టీమ్ ఫ్రీగానో లేదా తక్కువ బడ్జెట్ లోనో వర్క్ చేస్తే.. మాతోనూ అలాగే చేయించుకోవాలని చూస్తారు. ఫ్యామిలీలో ఒకరు ఇరిటేట్ చేస్తుంటే, మరొకరు సారీ చెప్తున్నారు. నాకు మీతో కలిసి పనిచేయడం ఇష్టం లేదు. మీరు టీమ్ కి ఇవ్వాల్సిన పేమెంట్స్ చెల్లించకపోతే.. మీ పేర్లు బయటపెడతాను" అంటూ ఒక పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ పోస్ట్ చూసి.. ఇది టాలీవుడ్ యంగ్ హీరోయిన్ కి సంబంధించిన వివాదమని పలువురు నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు. టాలీవుడ్ లో తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకొని, స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకునే స్థాయికి ఎదిగిన ఆమె.. ప్రస్తుతం బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఆ హీరోయిన్ విషయంలో అన్నీ వెనకుండి చూసుకునేది ఆమె తల్లే అంటారు. సినిమాల ఎంపిక, రెమ్యూనరేషన్ ఇలా ప్రతి విషయంలో మదర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందని చెబుతుంటారు. ఇప్పుడు బాలీవుడ్ లో ఈ వివాదానికి కూడా హీరోయిన్ మదరే కారణమని టాక్. మేకప్ టీమ్ ని తాము పెట్టుకుంటామని చెప్పి, ప్రొడ్యూసర్స్ నుంచి ఎక్కువ మొత్తం తీసుకొని.. ఆ టీమ్ కి మాత్రం సరిగా పేమెంట్స్ ఇవ్వట్లేదని ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో నిజానిజాలు ఎంతో తెలియాల్సి ఉంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.