English | Telugu

చిరంజీవి చిన్నల్లుడు మరో వివాహం చేసుకున్నాడా?

చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ మరో వివాహం చేసుకున్నాడా అనే సందేహం వస్తుంది చిరంజీవి చిన్న కూతురు శ్రియకు మొదటగా శిరీష్ భరద్వాజతో వివాహమైంది. వారిద్దరు ప్రేమ పెళ్లి చేసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయి వివాహం చేసుకున్నారు. ఆ తరువాత శిరీష్ భరద్వాజతో శ్రీ‌జ‌కు అభిప్రాయ భేదాలు వ‌చ్చాయి. దాంతో శిరీష్ భరద్వాజ్ నుంచి ఆమె విడాకులు తీసుకుంది. ఆ తర్వాత ఆమె క‌ళ్యాణ్ దేవ్ అనే వ్యాపార‌వేత్త‌ను వివాహం చేసుకోంది. వీరి సంసారం కొంతకాలం బాగానే జరిగింది. అయితే గత ఏడాది కాలంగా డిస్టెన్స్ మెయిన్టెన్ చేస్తున్నారు. వీరికి అభిప్రాయ భేదాలు వచ్చినట్టు తెలుస్తోంది. శ్రీజ తన తండ్రి చిరంజీవి వద్దనే ఉంటుంది. కళ్యాణ్ దేవ్ కూడా తన పేరెంట్స్ తో కలిసి ఉంటున్నాడు. అయినప్పటికీ వీరిద్దరూ విడిపోయినట్టు ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు. కానీ విడిపోయారు అనేది అందరికీ అర్థమవుతుంది.

ఇటీవల వీరిద్దరూ వాలెంటైన్స్ డే సందర్భంగా ఒకరినొకరు దెప్పి పొడుచుకుంటూ పోస్టులు చేశారు. ఒక మనిషిని ఇష్టపడడం కంటే అతన్ని మనం ఎలా ట్రీట్ చేస్తున్నామన్నది ముఖ్యమని కళ్యాణ్ దేవ్ కామెంట్ చేశాడు. దాని కౌంటర్‌గా శ్రీజ ఒకరిని ప్రేమించడం అంటే వాళ్లని వాళ్లు అధికంగా ప్రేమించుకునేలా చేయాలి. మిమ్మల్ని ఎల్లప్పుడూ ప్రేమించేలా చేసుకోవడం కాదు. ప్రేమను గుర్తించాలి.... అని కామెంట్ చేసింది దీంతో కళ్యాణ్ దేవ్ శ్రీ‌జ విడిపోయార‌ని అర్ధ‌మైంది..ఆయ‌న త్వ‌ర‌లో మ‌రో వివాహం చేసుకోబోతున్నాడని వార్తలు హల్చల్ చేశాయి.

సడన్‌గా కళ్యాణ్ దేవ్ పెళ్లి వేడుకల్లో కనిపించాడు. దాన్ని చూసి అందరూ కళ్యాణ్ దేవ్ రెండో వివాహం చేసుకున్నాడని భావించారు. కానీ తీరా చూస్తే అది తన ఫ్రెండ్ మ్యారేజ్ అని తెలిసింది. సదరు వివాహానికి కళ్యాణ్ దేవ్ మిత్రులతో కలిసి హాజరై ఎంజాయ్ చేశాడు. మ్యారేజి లో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరోవైపు కళ్యాణ్ దేవ్ సినీ పరిశ్రమకు కూడా దూరంగా ఉంటున్నాడు. ఆయన నటించిన మొదటి చిత్రం విజేత ఫర్వాలేదనిపించింది. తర్వాత సూపర్ మచ్చి చిత్రంలో నటించారు. 2022 సంక్రాంతి కానుకగా విడుదల అయింది. ఆశించ ఫలితం ఇవ్వలేదు. మూడో సినిమా కిన్నెరసాని నేరుగా ఓటీటీలో విడుదల అయింది ఆయన కొత్తగా సినిమాలకు సైన్ చేసిన దాఖలాలు లేవు.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.