English | Telugu

'కింగ్‌డమ్‌' విషయంలో శ్రీలీల జడ్జిమెంట్ నిజమైందా..?

ఒక్కోసారి ఒకరు నటించాల్సిన సినిమా మరొకరికి వెళ్తుంటుంది. అప్పుడు ఆ సినిమా హిట్ అయినా, లేదంటే ఆ పాత్రకి పేరొచ్చినా.. మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారనే కామెంట్స్ వినిపిస్తాయి. పొరపాటున ఆ సినిమా ఫ్లాప్ అయితే మాత్రం.. ఆ సినిమాని వదులుకొని మంచి పని చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతాయి. తాజాగా శ్రీలీల విషయంలో అదే జరుగుతోంది. (Kingdom)

విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన మూవీ 'కింగ్‌డమ్‌'. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం గురువారం(జూలై 31) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిజానికి ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీల నటించాల్సి ఉంది. 2023లో ప్రకటించిన ఈ సినిమా ఆలస్యమవుతుందనో లేదా శ్రీలీల వేరే ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండటం వల్లనో.. కారణమేంటో తెలియదు కానీ, ఈ ప్రాజెక్ట్ లోకి భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా వచ్చింది. అయితే 'కింగ్‌డమ్‌' విడుదలయ్యాక.. శ్రీలీల ఈ సినిమా నుంచి తప్పుకొని మంచి పని చేసిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

నేడు థియేటర్లలో అడుగుపెట్టిన 'కింగ్‌డమ్‌' నెగటివ్ టాక్ నే సొంతం చేసుకుంది. సినిమా ఎలా ఉందనేది పక్కన పెడితే.. అసలు ఇందులో హీరోయిన్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు. ఏదో కొన్ని సీన్స్ లో అలా వచ్చి వెళ్తుంది అంతే. నిజం చెప్పాలంటే అసలు ఆ పాత్ర లేకపోయినా.. కథకి వచ్చే నష్టమేమీ లేదు. ఇది చాలదు అన్నట్టు.. ఇందులో మూడో సాంగ్స్ ఉంటే, వాటిలో 'హృదయం లోపల' సాంగ్ లో హీరోయిన్ కనిపిస్తుంది. కానీ ఆ సాంగ్ ని కూడా.. సినిమా లోనుంచి తీసేశారు. దీంతో 'కింగ్‌డమ్‌'లో హీరోయిన్ పాత్ర ఏదో మొక్కుబడి అన్నట్టుగా ఉంది.

ఇటీవల శ్రీలీల వరుస పరాజయాలను చూసింది. ఇలాంటి సమయంలో 'కింగ్‌డమ్‌'లో భాగమై ఉంటే.. ఏమాత్రం ఇంపార్టెన్స్ లేని పాత్ర చేసిందనే విమర్శలు వచ్చేవి. ఇప్పుడు ఆ విమర్శల నుంచి శ్రీలీల తెలివిగా తప్పించుకుందనే చెప్పవచ్చు.

కాగా, శ్రీలీల చేతిలో ప్రస్తుతం పలు సినిమాలు ఉన్నాయి. తెలుగులో 'మాస్ జాతర', 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాలు చేస్తోంది. అలాగే హిందీలో 'ఆషికీ-3', తమిళ్ లో 'పరాశక్తి' చిత్రాల్లో నటిస్తోంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.