English | Telugu

శ్రీ రామరాజ్యం ఆడియో రిలీజ్

శ్రీ రామరాజ్యం ఆడియో రిలీజ్ భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రుల వారి సన్నిధిలో, సినీ అతిరథమహాథుల, అశేష నందమూరి బాలకృష్ణ అభిమానుల సమక్షంలో అత్యంత వైభవంగా జరిగింది. వివరాల్లోకి వెళితే నందమూరి నట సింహం నందమూరి బాలకృష్ణ శ్రీరామచంద్ర మూర్తిగా, అందాల నయనతార సీతా మహాసాధ్విగా, నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు వాల్మీకిగా నటిస్తూండగా, గ్రేట్ డైరెక్టర్ బాపు గారి దర్శకత్వంలో, యలమంచిలి సాయిబాబు నిర్మిస్తున్న పౌరాణిక కళాఖండం "శ్రీ రామరాజ్యం".

"శ్రీరామరాజ్యం" చిత్రంలో లక్ష్మణుడుగా హీరో శ్రీకాంత్, భరతుడిగా డైలాగ్ కింగ్ సాయికుమార్, దశరథుడిగా సీనియర్ నటులు బాలయ్య నటిస్తున్నారు. ముళ్లపూడి వెంకట రమణ "శ్రీ రామరాజ్యం" చిత్రానికి స్క్రీన్ ప్లే, సంభాషణలు వ్రాయగా, జొన్న విత్తుల, వెన్నెల కంటి పాటలను వ్రాశారు. "శ్రీ రామరాజ్యం" చిత్రానికి ఇసైరాజా, మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా వీనులవిందైన సంగీతాన్ని ఇచ్చారు. భద్రాచలం పుణ్యక్షేత్రంలో, ఆగస్టు 15 వ తేదీ, సోమవారం రాత్రి, స్వాతంత్ర్య దినోత్సవం నాడు యువరత్న నందమూరి బాలకృష్ణ చేతుల మీదుగా ఈ చిత్రం ఆడియో, ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి విడుదల చేయబడింది.

ఈ ఆడియో రిలీజ్ కు దర్శకులు బాపు, నిర్మాత యలమంచిలి సాయిబాబు, నందమూరి బాలకృష్ణ, నయనతార, నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, శ్రీకాంత్, మురళీ మోహన్, రచయిత పరుచూరి గోపాలకృష్ణ, బాలయ్య, ఆదిత్య దయానంద్, రచయిత జొన్నవిత్తుల, ఈ చిత్ర సంగీత దర్శకులు ఇళయరాజా, యువ దర్శకుడు బోయపాటి శ్రీను, బాలకృష్ణ సతీమణి శ్రీమతి వసుంధర తదితరులు హాజరయ్యారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.