English | Telugu

చేతులెత్తేసిన 'స్పై'.. స్టడీగా 'సామజవరగమన'!

జూన్ 29న 'స్పై'తో నిఖిల్, 'సామజవరగమన'తో శ్రీవిష్ణు బాక్సాఫీస్ బరిలోకి దిగారు. మంచి అంచనాలతో విడుదలైన స్పై.. నిఖిల్ కెరీర్ లోనే రికార్డు స్థాయి ఓపెనింగ్స్ రాబట్టింది. అయితే ప్రేక్షకుల అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయిన ఈ సినిమా కలెక్షన్లు రెండో రోజు నుంచే దారుణంగా పడిపోయాయి. ఇక ఐదో రోజుకి పూర్తిగా చేతులెత్తేసింది. మొదటిరోజు వరల్డ్ వైడ్ గా రూ.6.02 కోట్ల షేర్ రాబట్టిన 'స్పై'.. ఐదో రోజు 28 లక్షల షేర్ మాత్రమే రాబట్టిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఓవరాల్ గా దాదాపు రూ.16 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన ఈ మూవీ.. ఇప్పటిదాకా రూ.10.26 కోట్ల షేర్ రాబట్టింది. ఇప్పటికే దాదాపు ఈ సినిమా రన్ పూర్తయినట్టే. ఈ లెక్కన ఈ సినిమా బయ్యర్లకు కనీసం ఐదు కోట్ల నష్టాన్ని మిగిల్చే అవకాశముంది. 'స్పై' పరిస్థితి ఇలా ఉంటే, 'సామజవరగమన' పరిస్థితి మరోలా ఉంది. ఇప్పటికే లాభాల్లోకి ఎంటరైన ఈ సినిమా, స్టడీ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది.

పెద్దగా అంచనాల్లేకుండా ప్రేక్షకుల ముందుకొచ్చిన 'సామజవరగమన' మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈమధ్య కాలంలో కుటుంబమంతా చూసి నవ్వుకోదగ్గ సినిమాలు తగ్గిపోగా, ఆ లోటుని ఈ సినిమా తీర్చిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అందుకే ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. యూఎస్ లోనూ అదిరిపోయే వసూళ్లు రాబడుతూ హాఫ్ మిలియన్ దిశగా దూసుకుపోతోంది. మొదటిరోజు వరల్డ్ వైడ్ గా రూ.1.14 కోట్ల షేర్ రాబట్టిన 'సామజవరగమన'.. ఐదో రోజు సోమవారం అయినప్పటికీ రూ.91 లక్షల షేర్ రాబట్టిందంటే కలెక్షన్లు ఎంత నిలకడగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఓవరాల్ గా రూ.3.20 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన ఈ మూవీ.. ఇప్పటిదాకా రూ.6.32 షేర్ రాబట్టి మంచి లాభాలతో దూసుకుపోతోంది. ఫుల్ రన్ లో ఈ సినిమా పది కోట్ల షేర్ రాబట్టిన ఆశ్చర్యం లేదనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.