English | Telugu

'స్కంద' ఫస్ట్ రివ్యూ.. క్లైమాక్స్ ట్విస్ట్ కి పూనకాలే!

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న పాన్ ఇండియా మూవీ 'స్కంద'. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్. ఈ యాక్షన్ డ్రామా సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. 'అఖండ' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత బోయపాటి డైరెక్షన్ లో వస్తున్న సినిమా కావడంతో పాటు, రామ్-బోయపాటి కాంబోలో ఫస్ట్ మూవీ కావడంతో.. 'స్కంద'పై మంచి అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టే సినిమా అవుట్ పుట్ అదిరిపోయిందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా మునుపెన్నడూ చూడని క్లైమాక్స్ చూడబోతున్నామని, అది సినిమాకే హైలైట్ గా నిలవనుందని అంటున్నారు.

బోయపాటి సినిమాల్లో మాస్ ప్రేక్షకులు కోరుకునే యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు.. ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చే ఎమోషన్స్ కూడా ఉంటాయి. 'స్కంద' విషయంలో కూడా బోయపాటి అదే ఫార్ములా ఫాలో అయ్యారట. అయితే గత చిత్రాలతో పోలిస్తే ఇందులో ఎమోషన్స్ కి పెద్దపీట వేశారట. రెండు కుటుంబాల కోసం హీరో పడే తపన కట్టిపడేసేలా ఉంటుందట. ఇక క్లైమాక్స్ ట్విస్ట్ అయితే ఓ రేంజ్ లో ఉంటుంది అంటున్నారు. స్కంద క్లైమాక్స్ గురించి చాలారోజుల పాటు మాట్లాడుకోవడం ఖాయమని చెబుతున్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.