English | Telugu

శిల్పాశెట్టి హోటల్ మూసివేత.. పార్టీ ఇస్తున్న ప్రముఖ హీరోయిన్

ప్రముఖ హీరోయిన్ 'శిల్పాశెట్టి'(Shilpa shetty)సుదీర్ఘ కాలం నుంచి భారతీయ సినీ ప్రేక్షకులకి సుపరిచిస్థురాలు. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషలకి చెందిన పలు చిత్రాల్లో విభిన్నమైన పాత్రలని పోషిస్తు వస్తుంది. రేపు కన్నడ చిత్రం 'కేడి ది డెవిల్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. శిల్పాశెట్టి తన భర్త రాజ్ కుంద్రా తో కలిసి 2016 లో 'బాస్టియన్' అనే రెస్టారెంట్ ని ముంబై లోని బాంద్రా(Bandra)ఏరియాలో ఏర్పాటు చేసింది. ముంబై(Mumbai)నగర వ్యాప్తంగా ఇతర ఏరియాల్లో పలు బ్రాంచ్ లు కూడా ఉన్నాయి.

రీసెంట్ గా 'శిల్పాశెట్టి' సోషల్ మీడియా వేదికగా 'బాస్టియన్'(Bastian)రెస్టారెంట్స్ పై స్పందిస్తు 'బాంద్రా ఏరియాలో ఉన్న 'బాస్టియన్' ని గురువారం మూసివేస్తున్నాం. ఎంతో ఆదరణ సొంతం చేసుకోవడంతో పాటు, మాకెన్నో జ్ఞాపకాలని అందించింది. చివరిసారిగా బాస్టియన్ లో గురవారం వేడుక నిర్వహిస్తున్నాం. కుటుంబసభ్యులు,సన్నిహితులు, వ్యాపార భాగస్వామ్యులు, ఈ వేడుకకి హాజరు కానున్నారు. త్వరలో మరో కొత్త అనుభవంతో మీ ముందుకు వస్తానని తెలుపుతు పోస్ట్ చేసింది. సీ ఫుడ్ కి బాస్టియన్ ఫేమస్.

ఇటీవల శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా పై పెట్టుబడి ఒప్పందానికి సంబంధించి 60 కోట్ల రూపాయలు మోసం చేసారని పోలీస్ కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 'బాస్టియన్'
మూసి వేత ప్రాధాన్యత సంతరించుకుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.