English | Telugu

నా భర్త నుంచి విడిపోతున్నాను..ప్రముఖ నటి వెల్లడి

షీలా రాజ్ కుమార్..తమిళ చిత్ర పరిశ్రమలో అతి తక్కువ సమయంలోనే మంచి నటిగా గుర్తింపు పొందింది. 2016 లో వచ్చిన ఆరతు సైనం అనే మూవీతో చిత్ర రంగ ప్రవేశం చేసిన షీలా ఆ తర్వాత టూలెట్, మనుసంగదా, అసురవధం,నమ్మ వెట్టు పిళ్ళై ,ద్రౌపతి ,మండేలా, బిచ్చగాడు 2 లాంటి ఎన్నో చిత్రాల్లో అద్భుతంగా నటించి ఎంతో మంది తమిళ ప్రేక్షకులని తన నటనతో ఆకట్టుకుంది. తాజాగా ఆమెకి సంబంధించిన న్యూస్ ఒకటి తమిళ చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టిస్తుంది.

షీలా రాజ్ కుమార్ కి కొన్నేళ్ల క్రితం నటనకి సంబంధించి శిక్షణ ఇచ్చే చోళన్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. కొంత కాలం క్రితం వరకు వాళ్ళిద్దరి దాంపత్యం అన్యోన్యంగానే సాగింది .ఇప్పుడు ఏమైందో తెలియదు గాని షీలా తన ట్విట్టర్ ద్వారా చోళన్ నుంచి విడిపోతున్నట్టుగా ప్రకటించింది.ఈ సందర్భంగా షీలా చోళన్ కి థాంక్స్ చెప్పడం గమనార్హం.

షీలా ఇటీవలే లారెన్స్ ,ఎస్ .జె సూర్య ల కాంబినేషన్ లో కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం లో వచ్చిన జిగర్తాండ డబుల్ ఎక్స్ మూవీలో ఎస్ .జె సూర్య లవర్ గా నటించి మంచి మార్కులనే పొందింది. ఇకపోతే షీలా ఎందుకు విడాకులు తీసుకుంటున్నదనే విషయంలో మాత్రం తమిళ చిత్ర పరిశ్రమలో రకరకాల మాటలు వినపడుతున్నాయి. కొన్ని రోజులు ఆగితే కానీ అసలు విషయాలు బయటకి రావు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.