English | Telugu

ఆ సినిమాకి 20 కోట్లు తీసుకున్నాడు!

భారతీయ సినిమా చరిత్రలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సినిమా " ఐ " తెలుగులో 'మనోహరుడు'. 180 కోట్ల బడ్జెట్ తో గత మూడు సంవత్సరాలుగా ఈ సినిమాని శంకర్ తెరకెక్కిస్తున్నారు. అయితే శంకర్ ఈ సినిమాకి స్టార్ హీరో కన్నా రెట్టింపు రెమ్యునరేషన్ అందుకున్నట్టు చెన్నై ఫిల్మ్ వర్గాల సమాచారం. " ఐ " సినిమాకి ఆయన దాదాపు 20 కోట్ల రెమ్యునరేషన్ తీసుకొని రికార్డ్ సృష్టించారట. భారతదేశంలో ఇప్పటి వరకు ఏ దర్శకుడు ఇంత భారీ పారితోషికాన్ని అందుకోలేదట. సెప్టెంబర్ 15 చెన్నైలో గ్రాండ్ రేంజ్‌లో జరిగే ఈ సినిమా ఆడియోకు ఇంటర్నేషనల్ యాక్షన్ హీరో ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గర్ వస్తున్నాడని అంటున్నారు. ఈ దీపావళి స్పెషల్‌గా తమిళ్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, చైనీస్ భాషల్లో రికార్డ్ ప్రింట్స్‌తో ఈ సినిమా రిలీజ్ కానుంది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.