English | Telugu

విజయవాడతో మొదలుకానున్న'రభస'

వినాయక చవితి రోజున గ్రాండ్‌గా రిలీజ్‌కు సిద్దమవుతోంది యంగ్ టైగర్ 'రభస'. గత కొంతకాలంగా నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తితో చూస్తున్న ఈ సినిమా మొదటి షో ఎక్కడా పడుతుందని అనేది హాట్ టాపిక్ గా మారింది. లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈ సినిమా మొదటి షో విజయవాడలో ఈ రోజు రాత్రి 12:30 నిమిషాలకు ప్రారంభం కానుందని సమాచారం. అలాగే హైదరాబాద్ కూకట్ పల్లి భ్రమరాంబలో మొదటి షో పడనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆన్ లైన్ బుకింగ్స్ లో 'రభస' థియేటర్లన్ని మొదటి రోజు హౌస్ ఫుల్ అయ్యాయి. ఈ చిత్రంపై ఇప్పటికే ఇండస్ట్రీ లో పాజిటివ్ బజ్ ఉంది. మరి బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.