English | Telugu

మనం ఎంత కష్టపడ్డా రజనీకాంత్ కే పేరు వస్తుంది?.. అసలు రూపం బయటపడింది

సూపర్ స్టార్ 'రజనీకాంత్'(Rajinikanth)ఈ నెల 14 న 'కూలీ'(Coolie)తో వచ్చి తన కెరీర్ లో మరోసారి రికార్డు కలెక్షన్స్ ని వసూలు చేసాడు. చిత్ర బృందం అయితే ఇప్పటికే 500 కోట్ల రూపాయల గ్రాస్ ని వసూలు చేసినట్టు అధికారంగా ప్రకటించింది. ఈ మూవీలో రజనీకాంత్ ప్రాణ స్నేహితుడు క్యారక్టర్ లో అద్భుతంగా నటించి మరోసారి ప్రేక్షకులని మెప్పించాడు వర్సటైల్ నటుడు 'సత్యరాజ్'. ఒక రకంగా చెప్పాలంటే 'కూలీ' కథ మొత్తం 'సత్యరాజ్(Sathyaraj)చేసిన రాజశేఖర్ క్యారక్టర్ చుట్టూనే తిరుగుతుంది.

రీసెంట్ గా సత్యరాజ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు రజనీకాంత్, శంకర్(Shankar)కాంబినేషన్ లో వచ్చిన 'శివాజీ'(Shivaji)సినిమాలో విలన్ క్యారక్టర్ కి మొదట నన్నే అడిగారు. కానీ నేను చెయ్యనని చెప్పాను. నాకు అప్పుడప్పుడే హీరోగా మంచి అవకాశాలు వస్తున్నాయి. అలాంటి సమయంలో నెగిటివ్ రోల్ చేస్తే ఇక అన్ని అలాంటి అవకాశాలే వస్తాయని చెయ్యలేదు. కానీ నాకు రజనీకాంత్ సినిమాలో నటించడం ఇష్టం లేకనే శివాజీలో చేయలేదనే వ్యాఖ్యలు మీడియాలో సైతం వచ్చాయి. కానీ వాటిల్లో నిజం లేదని సత్యరాజ్ చెప్పుకొచ్చాడు.

సత్యరాజ్ చెప్పినట్టుగానే రజనీకాంత్ పక్కన ఎంత కష్టపడి చేసినా, తన స్టైల్, మేనరిజమ్స్ తో రజనీకాంత్ కే పేరు వస్తుందని, అందుకే శివాజీ లో చెయ్యనని సత్యరాజ్ చెప్పాడనే మాటలు తమిళ సినీ సర్కిల్స్ లో జోరుగానే వినిపించాయి. ఇప్పుడు సత్యరాజ్ చెప్పిన విషయంతో అలాంటి పుకార్లకి చెక్ పెట్టినట్లయింది. ఇక సత్య రాజ్ చెయ్యాల్సిన క్యారక్టర్ లో 'సుమన్'(Suman)చేసి తన నటనతో మెస్మరైజ్ చేసిన విషయం తెలిసిందే. శివాజీ విజయం మరింత పెరగడానికి కూడా భాగమయ్యాడు. 2007 వ సంవత్సరంలో 'శివాజీ' ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.