English | Telugu

ఎన్టీఆర్‌పై రాజకీయ కుట్ర.. ఇది ఎవరి పని?

టాలీవుడ్‌ హీరోలలో ఎన్టీఆర్‌కి ఉన్న ప్రత్యేక స్థానం గురించి అందరికీ తెలిసిందే. తన సినిమాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ అభిమానగణాన్ని పెంచుకుంటూ వెళ్తున్నారు. సినిమాలు తప్ప మరో విషయానికి ప్రాధాన్యం ఇవ్వని ఎన్టీఆర్‌ని అతని ప్రమేయం లేకపోయినా రాజకీయాల్లోకి లాగే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్టీఆర్‌కి సంబంధించిన చిన్న విషయాన్ని కూడా రాజకీయం చేసేందుకు కొందరు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీకి, టిడిపికి మధ్య రాజకీయ వైరం ఉందనే విషయం అందరికీ తెలిసిందే. ఏదో ఒక కారణంతో టీడీపీని అప్రతిష్టపాలు చేసేందుకు వైసీపీ నిరంతర ప్రయత్నం చేస్తూనే ఉంటుందనే విషయం కూడా అందరికీ తెలుసు. అయితే వారిద్దరి మధ్యలోకి ఎన్టీఆర్‌ని లాగడమే ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. రాజకీయాల జోలికి వెళ్ళకూడదని ఎన్టీఆర్‌ ఎప్పుడో నిర్ణయించుకున్నారు.

2009లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్టీఆర్‌ ప్రచారం చేశారు. అప్పుడతని వయసు 26 సంవత్సరాలు మాత్రమే. రాజకీయాల జోలికి వెళితే తన కెరీర్‌కే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని గ్రహించిన ఎన్టీఆర్‌ ఆ తర్వాత అటువైపు వెళ్ళలేదు. తన సినిమా కెరీర్‌పైనే దృష్టి పెట్టి టాలీవుడ్‌లో స్టార్‌ హీరో రేంజ్‌కి ఎదిగారు. ఆ తర్వాత కూకట్‌పల్లి నుంచి తన సోదరి పోటీ చేస్తున్నా ఎలాంటి ప్రచారానికి వెళ్ళలేదు. అయితే వ్యక్తిగతంగా తన మద్దతును తెలిపారు. రాజకీయాలకు దూరంగా ఉంటున్నప్పటికీ కొన్ని అనవసరమైన విషయాల్లో ఎన్టీఆర్‌ని లాగడం అనేది అభిమానులకు ఆందోళన కలిగిస్తున్న విషయం.

ఎన్టీఆర్‌ హీరోగా నటించిన సినిమాలు విడుదలైన ప్రతిసారీ ఏదో ఒక విషయంలో ఎన్టీఆర్‌ను హైలైట్‌ చేసి దానికి రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేస్తున్నారు. ఫేక్‌ ఎకౌంట్లు సృష్టించి వాటి ద్వారా ఎన్టీఆర్‌ను నందమూరి ఫ్యామిలీ, తెలుగుదేశం పార్టీ దృష్టిలో అప్రతిష్టపాలు చేసేందుకు పన్నాగాలు పన్నుతున్నారు. ఇటీవల కూలీ, వార్‌2 చిత్రాలు ఒకేరోజు విడుదలైన విషయం తెలిసిందే. సినిమా రంగంలో 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా కూలీ రిలీజ్‌ అవ్వడంతో రజినీకాంత్‌కి సోషల్‌ మీడియా ద్వారా విషెస్‌ తెలిపారు నారా లోకేష్‌. అదే సమయంలో వార్‌2 గురించి పట్టించుకోలేదు. దీన్ని ఆసరాగా చేసుకున్న వైసీపీ వర్గాలు.. ఎన్టీఆర్‌ అభిమానుల్ని రెచ్చగొట్టడం మొదలుపెట్టారు. ఎన్టీఆర్‌ని సపోర్ట్‌ చెయ్యని తెలుగుదేశం పార్టీకి మీరెందుకు సపోర్ట్‌ చేస్తారంటూ వారిని తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్‌ దృష్టి మాత్రం పూర్తిగా సినిమాలపైనే ఉంది. తను ఏం మాట్లాడినా దానికి పలు అర్థాలు సృష్టిస్తారనే కారణంగా చాలా విషయాల్లో మౌనంగానే ఉంటున్నారు. ‘వార్‌2’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో సినిమాలే తన లక్ష్యం అని స్పష్టం చేశారు ఎన్టీఆర్‌. అయినప్పటికీ అతని ప్రసంగంలోని కొన్ని మాటలను రాజకీయంగా వాడుకునేందుకు ప్రయత్నాలు జరిగాయి. ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ పేరుతో ఫేక్‌ ఎకౌంట్స్‌ క్రియేట్‌ చేసుకొని టీడీపీకి, ఎన్టీఆర్‌కి మధ్య గ్యాప్‌ పెంచేందుకు వైసీపీ వర్గాలు చేస్తున్న కుట్ర ఇదని టీడీపీ వర్గాలు చెబుతున్నమాట. ఏది ఏమైనా తన పనేదో తాను చేసుకుంటూ వెళ్తున్న ఎన్టీఆర్‌ను తమ రాజకీయ లబ్ది కోసం వివాదాల్లోకి లాగడం సరైంది కాదని అతని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.