English | Telugu

600 మెట్లపై సమంత కర్పూర దీపాలు!

సమంతా రౌత్ ప్రభు. ఈమె వాస్తవానికి క్రిస్టియన్. పుట్టుకతో క్రిస్టియన్ అయిన ఈమె హిందువు అయినా నాగచైతన్య ను వివాహం చేసుకుంది. వీరి వివాహం కూడా హిందూ క్రైస్తవ సాంప్రదాయాలలో జరిగాయి. అంతేగాని సమంత హిందుత్వం పుచ్చుకున్నట్టు ఎక్కడ వార్తలు రాలేదు. అలాగే నాగచైతన్య కూడా సమంత కోసం మతం మార్చుకోలేదు. ఇది అందరికీ తెలిసిన వాస్తవం. కానీ వీరిద్దరూ ప్రస్తుతం విడిపోయారు. విడిపోయిన తరువాత సమంత పలు సమస్యలను ఎదుర్కొంటుంది.

ప్రేమించి పెళ్లాడిన నాగచైతన్యతో విడిపోవడం మయూసైటిస్ వ్యాధి రావడంతో ఆమె జీవితం కాస్త అల్లకల్లోలానికి గురైంది. తాజాగా ఆమె మయోసైటిస్ వ్యాధి నుండి కోలుకుంటుంది. ప్రస్తుతం తనతో ది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ తీసిన దర్శకద్వ‌యం రాజ్ అండ్ డీకే లతో సీటాడెల్ అనే వెబ్ సిరీస్ చేస్తుంది. ముంబై టు హైదరాబాద్ ప్రయాణం చేస్తుంది. తెలుగులో ఖుషి సినిమాలో పాల్గొనాల్సి ఉంది. ఈమె హైదరాబాద్‌కు కూడా పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తోంది.

తాజాగా ఈమె ప‌ళ‌నిలోని మురుగ‌న్ ఆలయాన్ని సందర్శించింది. ఆలయంలోని 600 మెట్లపై కర్పూరం వెలిగించి మొక్కు తీర్చుకుంది. పళని మురుగన్ ఆలయంలో సమంత మొక్కు తీర్చుకున్న ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొన్న మొన్నటి వరకు అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్న సమంత ఇలా 600 మెట్లపై కర్పూరం వెలిగించి మొక్కు తీర్చుకోవడం మామూలు విషయం కాదు. సమంతాతో పాటు ఆమె స్నేహితులు పలని మురుగన్ ఆలయంలో సందడి చేశారు. ఆశ్చర్యకరంగా జానూ చిత్ర దర్శకుడు ప్రేమ్ కుమార్ కూడా సమంతతో ఉన్నాడు. స్వామి ఆశీస్సులు తీసుకునేందుకు వచ్చానని స్థానిక మీడియాతో సమంతా చెప్పుకొచ్చింది. మయోసైటీస్ నుంచి ఈమె పూర్తిగా కోలు కున్నట్టే కనిపిస్తోంది. అన్ని కార్యక్రమాల్లో రెగ్యులర్‌గా ఉంటుంది. దాంతో ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆమె నటించిన శాకుంతల చిత్రం ఫిబ్రవరి 17న విడుదల కావాల్సి ఉంది. కానీ ఈ చిత్రం ఏప్రిల్‌కి వాయిదా పడింది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.