English | Telugu

31 ఏళ్ళ తేడా ఐతే ఏం చేద్దాం..నాకు ఓకే కదా!

బాలీవుడ్ అగ్రహీరో 'సల్మాన్ ఖాన్'(salman khan)రంజాన్(ramadan)కానుకగా ఈ నెల 30 న 'సికందర్'(Sikandar)తో వరల్డ్ వైడ్ గా అడుగుపెడుతున్న విషయం తెలిసిందే.గత కొంత కాలంగా సరైన హిట్ లేని సల్మాన్ సికందర్ తో తన సత్తా చాటతాడని అభిమానులతో పాటు ప్రేక్షకులు ఎంతో నమ్మకంతో ఉన్నారు.సల్మాన్ కి జోడిగా వరుస విజయాలతో నేషనల్ క్రష్ గా మారిన స్టార్ హీరోయిన్ రష్మిక(Rashmika Mandanna)చేస్తుండటంతో 'సికందర్' పై అందరిలో పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి.

రీసెంట్ గా సికందర్ ట్రైలర్‌ లాంచ్ ఈవెంట్‌ ముంబై లో జరిగింది.భద్రతా కారణాల దృష్ట్యా చిత్ర యూనిట్ తో పాటు కొద్దిమంది సల్మాన్ అభిమానుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో సల్మాన్‌ తో ఒక మీడియా ప్రతినిధి రష్మిక,సల్మాన్ ఏజ్ కి మధ్య గ్యాప్ గురించి ప్రశ్న వేసాడు.దీంతో సల్మాన్ మాట్లాడుతు మా వయసు గురించి మీకెందుకు నాకు,రష్మికకి మధ్య దాదాపు 31 ఏళ్ల తేడా ఉందని అంటున్నారు.ఈ విషయంలో రష్మిక ఆమె తండ్రికి లేని సమస్య మీకెందుకు.ఒకవేళ భవిష్యత్తులో రష్మిక కి పెళ్లి జరిగి పాప పుడితే,ఆ పాప కూడా హీరోయిన్ అవుతుంది.అప్పుడు ఆ పాపతో కూడా నేను కలిసి నటిస్తానని సల్మాన్ చెప్పుకొచ్చాడు.ఇప్పుడు ఈ మాటలు ఇండియన్ సినీ సర్కిల్స్ లో వైరల్ గా మారాయి.

ఇక 'సికందర్‌' ట్రైలర్‌ చూస్తుంటే సల్మాన్ క్యారక్టర్ లో విభిన్న రకాల షేడ్స్ ఉన్నట్టుగా అర్ధమవుతుంది.యాక్షన్ థ్రిల్లర్ అయినప్పటికీ దర్శకుడు 'మురుగదాస్'(Ar Murugadoss)గత చిత్రాల మాదిరిగా బలమైన సోషల్ మెసేజ్ కూడా ఉందనే విషయంలో పూర్తి క్లారిటీ వచ్చింది. సల్మాన్ నట విశ్వరూపం పక్కా అని అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.సత్య రాజ్,కాజల్ అగర్వాల్,అంజిని థావన్,కిషోర్ షర్మాన్ జోషి తదితరులు కీలక పాత్రలు పోషించగా సాజిద్ నడియావాలా(Sajid Nadiadwala)అత్యంత భారీ వ్యయంతో నిర్మించాడు.ట్రైలర్ రిలీజ్ అయ్యి 24 గంటలు గడవక ముందే 43 మిలియన్ల వ్యూస్ ని సాధించడంతో పాటు ట్రెండింగ్ పరంగా మూడోస్థానంలో ఉంది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.