English | Telugu

ఘనంగా 'ఆర్ఆర్ఆర్' ఆస్కార్ వేడుక

సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి, గీత రచయిత చంద్రబోస్ ఆస్కార్ వేదిక మీద తెలుగు జెండా ఎగురవేశారు. 'ఆర్ఆర్ఆర్'లోని 'నాటు నాటు' పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గా ఆస్కార్ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. ఇండియన్ సినిమా పాట ఆస్కార్ గెలుచుకోవడం ఇదే మొదటిసారి. ఓ తెలుగు సినిమా పాట ఈ అరుదైన చరిత్రను సృష్టించడంతో తెలుగు సినీ పరిశ్రమతో పాటు సినీ అభిమానులంతా ఎంతో సంబరపడ్డారు. తెలుగు గడ్డ మీదకు ఆస్కార్ తీసుకొచ్చిన కీరవాణి, చంద్రబోస్ ని తాజాగా సినీ పరిశ్రమ ఘనంగా సత్కరించింది.

ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లోని శిల్ప కళా వేదికలో 'ఆర్ఆర్ఆర్ ఆస్కార్ వేడుక' ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ఆర్ఆర్ఆర్ టీం తో పాటు తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్, ఏపీ సినిమాటోగ్రఫీ మినిస్టర్ చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణ, కె.రాఘవేంద్రరావు, అల్లు అరవింద్, దిల్ రాజు, పరుచూరి గోపాలకృష్ణ, త్రివిక్రమ్, కాశీ విశ్వనాథ్, వై.వి.ఎస్ చౌదరి, రానా దగ్గుబాటి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కీరవాణి, చంద్రబోస్ ని ఘనంగా సత్కరించిన అతిథులు.. ఆర్ఆర్ఆర్ మూవీ టీమ్ పై ప్రశంసలు కురిపించారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.