English | Telugu

రామ్ చరణ్ సినిమాకి బిగ్ నెగటివ్ సెంటిమెంట్!

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తన 15వ సినిమా 'గేమ్ ఛేంజర్'ను చేస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. తన తదుపరి చిత్రాన్ని 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. వృద్ధి సినిమాస్ బ్యానర్ లో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాకి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారని సమాచారం. అయితే ఈ వార్త విని చరణ్ అభిమానులు ఓ వైపు ఆనందపడుతూనే మరోవైపు ఆందోళన చెందుతున్నారు.

ఏఆర్ రెహమాన్ లాంటి దిగ్గజం సంగీతం అందించడం గుడ్ న్యూసే. అయితే తెలుగులో ఆయన ట్రాక్ రికార్డే ఫ్యాన్స్ కి కాస్త ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటిదాకా రెహమాన్ సంగీతం అందించిన టాలీవుడ్ స్టార్ల సినిమాలేవీ విజయం సాధించలేదు. వెంకటేష్ 'సూపర్ పోలీస్', మహేష్ బాబు 'నాని', పవన్ కళ్యాణ్ 'కొమరం పులి' సినిమాలకు రెహమాన్ సంగీతం అందించగా.. ఆ మూడు సినిమాలు ఘోర పరాజయం పాలయ్యాయి. ఆ నెగటివ్ సెంటిమెంటే చరణ్ ఫ్యాన్స్ ఆందోళనకు కారణమైంది. మరి చరణ్ ఈ నెగటివ్ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తాడేమో చూడాలి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.