English | Telugu

బాలీవుడ్ భామను నిలదీసిన అధికారులు



బాలీవుడ్ నటి రిచా చద్దాను ఢిల్లీ విమానాశ్రయంలో సెక్యూరిటీ అధికారులు 2 గంటలపాటు నిలిపివేశారు. ఆమె వద్ద వున్న ఒక పౌడర్ విషయంలో అనుమానం తలెత్తి విమానాశ్రయ భద్రతాధికారులు, కస్టమ్స్ అధికారులు రెండు గంటల పాటు ఆమెను ప్రశ్నించారు. ఆయుర్వేద పౌడర్ డబ్బాని చూసి అధికారులు అనుమానించారని. చర్మ సౌందర్యానికై తాను ఆరు నెలలుగా వాడుతున్నానని ఆమె అధికారులకు నచ్చచెప్పినా వారు వినిపించుకోలేదట.


ఢిల్లీ నుంచి ఇంతకు ముందు ఇలా తీసుకువెళ్లినప్పుడు ఎప్పుడు ఇటువంటి ఇబ్బంది ఎదురవలేదని మొదటి సారి ఇలా అధికారులు తనను నిలిపివేశారని రిచా చడ్డా చెప్పుకొచ్చింది. ఆయుర్వేదాన్ని తాను పూర్తిగా నమ్ముతానని, అందుకే ఆయుర్వేద వస్తువులే వాడతానని రిచా తెలియచేసింది. అయితే ఆ ఆయుర్వేద పౌడర్ దొరకడం కష్టమని అందుకే ఆ డబ్బా తెరవడానికి తాను ఒప్పుకోలేదని రిచా తెలిపింది. కానీ వారు ఈ విషయాన్ని నమ్మకపోవడంతో డబ్బా తెలిచి చూపించాల్సి వచ్చిందని ఆమె మీడియాకు తెలిపారు. ఆమె 'గోలియోంకా రాస్ లీల రామ్ లీల' సినిమాలో దీపికా పదుకునేకు 'గ్యాంగ్ ఆఫ్ వాస్సేపూర్', 'ఓయే లక్కి! లక్కి ఓయే' చిత్రాల్లో నటించింది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.