English | Telugu

హీరోయిన్‌ కోసం రవితేజ తంటాలు!

ఎక్కువగా కమర్షియల్‌ మూవీస్‌ చేయటానికి ఇష్టపడే కథానాయకుడు మాస్‌ మహారాజ రవితేజ ఇప్పుడు తదుపరి సినిమాను గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో చేయటానికి రెడీ అయ్యారు. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ఈ మూవీలో హీరోయిన్‌ ఎవరనే విషయంపై మేకర్స్‌ ఇంకా మల్లగుల్లాలు పడుతున్నట్లు సినీ సర్కిల్స్‌ సమాచారం. నిజానికి ప్రాజెక్ట్‌ ఫైనలైజ్‌ అయినప్పుడు వినిపించిన పేరు శ్రీలీల. అయితే ఆమె చేతినిండా అవకాశాలతో ఫుల్‌ బిజీగా ఉండటం వల్ల డేట్స్‌ను కేటాయించలేనని ముందుగానే ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకుంది. తర్వాత అవకాశం శాండిల్‌ వుడ్‌ బ్యూటీ రష్మిక మందన్న చేతికి వెళ్లింది.

క్రేజీ హీరోయిన్‌గా పాన్‌ ఇండియా రేంజ్‌ ప్రాజెక్ట్స్‌ చేస్తున్న రష్మిక మందన్న సైతం డేట్స్‌ అడ్జస్ట్‌ చేయలేనని సింపుల్‌గా నో చెప్పేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో మేకర్స్‌ ఇప్పుడు చెన్నై బ్యూటీ ప్రియాంక అరుల్‌ మోహన్‌ను రంగంలోకి దించే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రియాంక అరుల్‌ మోహన్‌ ఇప్పుడేమీ ఖాళీగా లేదు. పవన్‌ కళ్యాణ్‌తో ఓజీ సహా నాని - వివేక్‌ ఆత్రేయ సినిమా సరిపోదా శనివారంలో నటిస్తుంది. ఇప్పుడు రవితేజ మూవీ ఆఫర్‌ వెళ్లింది. మరి ఈ చెన్నై సొగసరి ఏమంటుందో చూడాలి. నిజ ఘటనలు ఆధారంగా గోపీచంద్‌ మలినేని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మునుపెన్నడూ చూడనంత పవర్‌ఫుల్‌గా ఆయన పాత్ర ప్రేక్షకులను మెప్పించేలా ఉంటుందని సినీ సర్కిల్స్‌ సమాచారం.

ఇంతకు ముందు రవితేజ, గోపీచంద్‌ మలినేని కాంబినేషన్‌లో డాన్‌ శీను, బలుపు, క్రాక్‌ చిత్రాలు బ్లాక్‌ బస్టర్స్‌గా నిలిచాయి. ఇప్పుడు నాలుగో సినిమా రూపొందనుంది. నవంబర్‌ నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థపై నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవి శంకర్‌ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.