English | Telugu

'రావణాసుర' బ్రేక్ ఈవెన్ కష్టమేనా?

మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రం 'రావణాసుర'. ఈ యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'ధమాకా', 'వాల్తేరు వీరయ్య' వంటి బ్లాక్ బస్టర్ల తర్వాత రవితేజ నటించిన సినిమా కావడంతో 'రావణాసుర'తో హ్యాట్రిక్ కొట్టడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ట్రైలర్ కూడా ఆకట్టుకోవడంతో మంచి అంచనాలే ఏర్పడ్డాయి. అయితే సినిమా మాత్రం విడుదల రోజు డివైడ్ టాక్ సొంతం చేసుకుంది. కలెక్షన్స్ కూడా రెండో రోజు నుంచి డ్రాప్ అవ్వడంతో బ్రేక్ ఈవెన్ అందుకోవడం కష్టమే అనిపిస్తోంది.

రూ.23 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగిన రావణాసుర.. మొదటి రోజు వరల్డ్ వైడ్ గా రూ.4.95 కోట్ల షేర్ రాబట్టగా, రెండో రోజు రూ.2.85 కోట్ల షేర్ రాబట్టింది. దీంతో రెండు రోజుల్లో రూ.7.80 కోట్ల షేర్ వసూలు చేసింది. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఇంకా రూ.15 కోట్లకు పైగా షేర్ రాబట్టాల్సి ఉంది. మూడో రోజైన ఈరోజు ఆదివారం కావడంతో మరో రూ.2.5 నుంచి 3 కోట్ల దాకా షేర్ కలెక్ట్ చేసే అవకాశముంది. ఇంకా 12 కోట్లకు షేర్ రాబట్టాల్సి ఉంటుంది. అయితే వీక్ డేస్ కావడంతో సోమవారం నుంచి కలెక్షన్స్ ఇంకా బాగా డ్రాప్ అవుతాయి. పైగా 'దసరా' రెండో వారంలో కూడా బాగానే ఆడుతుంది. ముఖ్యంగా నైజాంలో అదిరిపోయే కలెక్షన్స్ రాబడుతోంది. దానికి తోడు ఈ వారం 'శాకుంతలం', 'విడుదల-1' వంటి సినిమాలు రానున్నాయి. మరి ఈ ప్రతికూలతల నడుమ రావణాసుర బ్రేక్ ఈవెన్ సాధిస్తే అద్భుతమే అని చెప్పాలి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.