English | Telugu

ఆ మానవత్వమే రెహమాన్‌ని ఆకాశమంత ఎత్తులో నిలబెట్టింది!

సినిమా రంగంలో ఉన్నత స్థానంలో వున్న నటీనటులుగానీ, టెక్నీషియన్స్‌గానీ ఎక్కువ శాతం ఎంతో కష్టపడి ఆ స్థాయికి వచ్చిన వారే. ప్రస్తుతం ప్రపంచంలోనే మేటి సంగీత దర్శకుల్లో ఒకరైన ఎ.ఆర్‌.రెహమాన్‌ కూడా అలా వచ్చిన వాడే. తన తొలి రోజుల్లో ఎన్నో కష్టాలు అనుభవించాడు. అందరికీ అతను ఓ సంగీత దర్శకుడిగానే తెలుసు. వ్యక్తిత్వపరంగా ఎలాంటి వాడు, తన మ్యూజిషియన్స్‌ విషయంలో అతను ఎలా ఉంటాడు.. అనేది చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. వారిలో గేయ రచయిత అనంతశ్రీరామ్‌ ఒకరు. ఇటీవల టీవీలో వచ్చిన ఓ కార్యక్రమంలో ఎ.ఆర్‌.రెహమాన్‌ని దగ్గరగా గమనించిన వ్యక్తిగా ఆయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడిరచారు.

‘ఎ.ఆర్‌.రెహమాన్‌ ఒక మ్యూజిషియన్‌గా పగలు వర్క్‌ చేస్తూనే సాయంత్రం యాడ్స్‌ కోసం జింగిల్స్‌ చేసేవారు. అసలు ఆయన ఎప్పుడు పడుకునేవారు అనే దానికి రెహమాన్‌ దగ్గర కూడా సమాధానం ఉండేది కాదు. చిన్నతనంలో అంత కష్టపడ్డారు. సముద్రం లోతుల్లోకి ఎంతో కష్టపడి వెళితేనే మణులు దొరుకుతాయి. అలా రెహమాన్‌కి ఒక మణి, ఒక రత్నం కలిపి మణిరత్నం అనే దర్శకుడు దొరికారు. అలా రెహమాన్‌ చేసిన మొదటి సినిమాకే నేషనల్‌ అవార్డు గెలుచుకున్నారు. అలాగే భారతదేశానికి తొలిసారి రెండు ఆస్కార్‌ అవార్డులు తెచ్చిపెట్టారు. ఇదంతా మనకు తెలిసిన చరిత్ర. కానీ, అందరికీ తెలియని ఒక విషయం నేను చెబుతాను. ఆయనలోని మానవత్వమే ఆయన్ని విశ్వ మానవుడిగా నిలబెట్టింది అనడానికి ఈ సంఘటన ఓ ఉదాహరణ. తన దగ్గరికి వచ్చే మ్యూజిషియన్స్‌కి బయట ఎంత ఇస్తున్నారో అంతకు రెట్టింపు తాను ఇవ్వగలిగితేనే నేను వారిని పిలవాలి అనుకునేవారు. ఆ పేమెంట్స్‌ అన్నీ మ్యూజిషియన్స్‌కి సరిగ్గా అందించే బాధ్యతను తన తల్లికి అప్పగించారు రెహమాన్‌. మ్యూజిషియన్స్‌కి, సింగర్స్‌కి వాళ్ళ అమ్మగారే పేమెంట్స్‌ ఇస్తుండేవారు. ఈమధ్య ఆమె కొన్నాళ్ళు అనారోగ్యంతో బాధపడ్డారు. కోలుకొని నెలరోజుల తర్వాత కర్ర సాయంతో ఆఫీస్‌కి వచ్చారు. అప్పుడు హాల్‌లో ఒక మ్యూజిషియన్‌ కూర్చొని ఉండడాన్ని గమనించిన ఆమె.. ‘ఇక్కడ కూర్చున్నావేం బాబూ’ అని అడిగింది. దానికి అతను ‘నెలరోజుల క్రితం చేసిన రికార్డింగ్‌కి ఇంకా పేమెంట్‌ రాలేదు’ అని చెప్పాడు. ఆ సమయంలో రెహమాన్‌ ముగ్గురు పెద్ద డైరెక్టర్లతో సిట్టింగ్‌లో ఉన్నారు. ఒక్కసారిగా ఆ రూమ్‌ తలుపులు తోసుకొని వెళ్ళి రెహమాన్‌ ముందు నిలబడి ‘వాళ్ళకి పేమెంట్‌ రావడం లేదట. ఏం చేస్తున్నారు మీరు? నేను కొన్నాళ్ళు చూసుకోకపోతే సిస్టమ్‌ మొత్తం మార్చేస్తారా? నీకు గుర్తుందా.. మీ నాన్నగారు పోయిన తర్వాత మనకు పేమెంట్స్‌ రాకపోతే ఇల్లు గడవడానికి ఎంత ఇబ్బందులు పడేవాళ్ళం. అదే పరిస్థితి మిగతా వాళ్ళకి మనం కలిగిస్తామా? వెంటనే వెళ్లి పేమెంట్స్‌ క్లియర్‌ చెయ్‌’ అని చెప్పారు. వెంటనే ఆ సిట్టింగ్‌ ఆపి ఎకౌంట్‌ డిపార్ట్‌మెంట్‌కి వెళ్ళి ఎవరెవరికి పేమెంట్స్‌ ఆగాయో వాళ్ళందరికీ ఒకేసారి ఎమౌంట్స్‌ పంపించేశారు. ఒక వ్యక్తిని ప్రజ్ఞ శిఖరం మీద నిలబెడితే.. అతని మానవత్వం అతన్ని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్తుందనడానికి రెహమాన్‌గారి జీవితమే ఓ ఉదాహరణ’ అని వివరించారు అనంతశ్రీరామ్‌.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.