English | Telugu

రానా "కృష్ణం వందే జగద్గురుం" ప్రారంభం

మూవీ మొగల్ డాక్టర్ డి.రామానాయుడి గారి మనవడు, ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కుమారుడు, విక్టరీ వెంకటేష్ అన్న కుమారుడు అయిన యువ హీరో రానా హీరోగా, "గమ్యం", "వేదం" చిత్రాల ఫేం క్రిష్ దర్శకత్వంలో, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై, జాగర్లమూడి సాయిబాబు, వై.రాజీవ్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న విభిన్న కథా చిత్రం "కృష్ణం వందే జగద్గుర

ఈ "కృష్ణం వందే జగద్గురుం" చిత్రం హైదరాబాద్ డాక్టర్ రామానాయుడు స్టుడియోలో, విక్టరీ వెంకటేష్ క్లాప్ కొట్టగా, రామానాయుడు కెమెరా స్విచ్చాన్ చేయగా, ముహూర్తం షాట్ కు దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించగా ఘనంగా ప్రారంభమైంది. ఈ "కృష్ణం వందే జగద్గురుం" చిత్రం జనవరి, ఫిబ్రవరి, మార్చ్ నెలల్లో షూటింగ్ జరుపుకుని, "మే" నెలలో వేసవి శలవుల సందర్భంగా విడుదలవుతుందని ఈ "కృష్ణం వందే జగద్గురుం" చిత్రం యూనిట్ తెలియజేసింది.

ఈ "కృష్ణం వందే జగద్గురుం" చిత్రానికి మాటలు ప్రముఖ రంగస్థల కళాకారులు బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మనవడు బుర్రా సాయిమాధవ్ వ్రాస్తూండగా, కెమెరాని జ్ఞానశేఖర్, సంగీతం కీరవాణి నిర్వహిస్తున్నారు. ఈరోజు ఈ చిత్రం హీరో రానా జన్మదినం కూడా కావటంతో ఆయన అభిమానులు గజమాలలతో ఆయన్ని సత్కరించారు.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.