English | Telugu

భారీ బడ్జెట్‌తో మూడు భాగాలుగా పెద్ద స్టార్స్‌తో ‘రామాయణం’!

సీతారాముల చరితం ఎన్నిసార్లు చూసినా కొత్తగానే ఉంటుంది. భారతదేశంలో సినిమా మొదలైన నాటి నుంచి నిన్నటి ఆదిపురుష్‌ వరకు రామాయణ గాధని వివిధ కోణాల్లో మనం చూస్తూనే ఉన్నాం. రామాయాణాన్ని ఒక్కో దర్శకుడు ఒక్కోరకంగా చూపించారు. ఆమధ్య టీవీలో కూడా ధారావాహికగా ఈ ఇతిహాసాన్ని ఆవిష్కరించారు. ఇప్పుడు అదే రామాయణాన్ని మూడు భాగాలుగా భారీ బడ్జెట్‌తో నిర్మించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌, మధు మంతెన హై బడ్జెట్‌లో రామాయణం చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు జరుపుతున్నారని సమాచారం. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో ప్రారంభం కావాల్సింది. కానీ, కొన్ని కారణాల వల్ల ఆలస్యమైంది. మొత్తానికి మళ్ళీ ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు పూనుకున్నారు. బాలీవుడ్‌ హీరో రణబీర్‌ కపూర్‌ రాముడిగా, సీతగా సాయిపల్లవి, రావణాసురుడుగా కెజిఎఫ్‌ ఫేమ్‌ యష్‌ నటిస్తారని తెలుస్తోంది. ఆమధ్య బాపు దర్శకత్వంలో వచ్చిన శ్రీరామరాజ్యం చిత్రంలో సీతగా నయనతార అందర్నీ మెప్పించింది. అయితే ప్రభాస్‌ రాముడిగా నటించిన ఆదిపురుష్‌లో కృతిసనన్‌కు సీతగా గుర్తింపు రాలేదు.

మూడు భాగాలుగా తెరకెక్కనున్న రామాయణం మొదటి భాగంలో సీతారాముల కల్యాణం, దానికి ముందు జరిగే సంఘటనల నేపథ్యం ఉంటుంది. రెండో భాగంలో రావణాసురుడు.. సీతని లంకకు తీసుకెళ్లడం, రామ, రావణాసుర యుద్ధ సన్నివేశాలు ఉంటాయి. ఇక మూడో భాగంలో లవకుశల జననానికి సంబంధించి అంశం ఉంటుంది. మొత్తానికి మూడు భాగాల్లో రామాయణం మొత్తాన్ని చూపించే ప్రయత్నం చేస్తారట. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో షూటింగ్‌ మొదలుపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .